E-Paper

TGSRTC Merger: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ విలీనం తర్వాతే వేతన సవరణపై నిర్ణయం!

TGSRTC Merger: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ విలీనం తర్వాతే వేతన సవరణపై నిర్ణయం!

TGSRTC Merger: స్వేచ్చ బ్యూరో: టీజీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కార్మికుల ప్రయోజనాలను కాపాడే దిశగా సాగుతోందని మహబూబ్‌నగర్ ప్రాంతీయ మేనేజర్‌ (ఆర్‌ఎం) సంతోష్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌ఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంగళరావు సందర్శించిన సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం విడుదల చేసిన కరపత్రంలోని అంశాలను ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గతంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.

టీజీఎస్‌ఆర్టీసీ సంస్థలో విలీనం..

విలీన ప్రక్రియ పూర్తయిన అనంతరం 2021 వేతన సవరణ అంశాలను కూడా సానుకూలంగా పరిశీలించే అవకాశం ఉందన్నారు. టీజీఎస్‌ఆర్టీసీ సంస్థలో విలీనం జరిగితే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన ప్రయోజనాలు, సౌకర్యాలు, ఆర్థిక పరిరక్షణ లభించే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని కార్మిక వర్గాలు కోరుతున్నాయని, ఈ డిమాండ్‌ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందన్నారు. కార్మికులకు ఒక ఉన్నత స్థాయి కమిటీ ద్వారా న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

Also read: షాకింగ్ ఫీచర్లు.. అమేజ్‌ఫిట్ నుంచి ఒకేసారి 3 కొత్త స్మార్ట్‌వాచ్‌లు లాంచ్.. ధరలు ఇవే!

సంక్షేమ అంశాలపై స్పష్టత..

ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో విలీన ప్రక్రియకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విలీనం వల్ల కార్మికులకు కలిగే ప్రయోజనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ అంశాలపై స్పష్టత కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల భవిష్యత్తుకు భద్రత కల్పించడంతో పాటు వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉద్యోగులు అపోహలకు గురికాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఆర్‌ఎం సంతోష్‌కుమార్ సూచించారు.

Also read: RV Karnan: జీహెచ్ఎంసీలో పెద్దన్న మౌనం.. అసలు కారణం అదేనా..?

Related News

Huzurabad: హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డికి.. వొడితల ప్రణవ్ హైవోల్టేజ్ సవాల్..?

PHC Negligence: చల్లూర్ పీహెచ్‌సీలో రోగుల ప్రాణాలతో చెలగాటం!

Illegal Venture: మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వెంచర్ రిజిస్ట్రేషన్లు కలకలం

Tank Neglect: జహీరాబాద్‌లో ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం.. ఎండిపోతున్న రైతుల పొలాలు!

TG Ration Card: ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు.. అయినా రేషన్ కార్డు జారీ!

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. మంత్రి తుమ్మల, ఎంపీ అనిల్ స్టేట్‌మెంట్స్ రికార్డ్

Jagadish Reddy: హ్యామ్ రోడ్ల పేరిట రేవంత్ సర్కార్ పెద్ద స్కామ్.. సీఎంపై జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు!

×