E-Paper
Advertisement

TSRTC : హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త

TSRTC : హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త

TSRTC : తెలుగు రాష్ట్రాల్లోని బస్సు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. వేసవికాలం నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులు, రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు ప్రయాణం చేసే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే దారిలో ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రకటించారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు 120కి పైగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. లహరి ఏసీ స్లీపర్ బస్సులు 2, నాన్ ఏసీ స్లీపర్, కమ్ సీటర్ బస్సులు 2, గరుడ ప్లస్ 9, ఈ గరుడ 10, సూపర్ లగ్జరీ 62, రాజధాని 41 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.

అయితే ఇందులో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది వెళ్లడానికి, తిరిగి రావడానికి కూడా ముందస్తు బుకింగ్ చేసుకుంటే ఇదే రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు http://tsrtconline.in వెబ్ సైట్ లో టిక్కెట్ బుక్ చేసుకోవాలని సూచించారు.

Tags

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×