Road Accident: మేడ్చల్ స్వేచ్ఛ, బ్యూరో: శామీర్పేట్ మండల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కంటైనర్ లారీ డ్రైవర్ ఆగి ఉన్న కారును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఈసీఐఎల్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్న కారు శామీర్పేట్ ఎగ్జిట్–7 సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఆగింది.
Also Read: IRCTC TDR File: రైలు 3 గంటలు ఆలస్యమైందా? మీ డబ్బులు వాపస్.. IRCTCలో TDR ఫైలింగ్ గురించి తెలుసా?
కారులో ప్రయాణిస్తున్న వారు వాహనాన్ని పక్కకు నిలిపి వెనకాల నిలబడి భోజనం చేస్తుండగా, వేగంగా వచ్చిన కంటైనర్ లారీ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారుకు వెనకాల ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను మౌలాలి ప్రాంతానికి చెందిన మొహమ్మద్ యూసుఫ్, మొహమ్మద్ హుస్సేన్గా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: AC vs Air Cooler: ఏసీ కొంటే బెటరా? లేదా కూలర్ మంచిదా? మధ్యతరగతి ఇంటికి ఏది బెస్ట్?