BigTV English
Advertisement

Rain Alert: దూసుకొస్తున్న రెండు అల్పపీడనాలు.. ఈ జిల్లాలకు మరో 5 రోజులు దబిడి దిబిడే..

Rain Alert: దూసుకొస్తున్న రెండు అల్పపీడనాలు.. ఈ జిల్లాలకు మరో 5 రోజులు దబిడి దిబిడే..

Rain Alert: బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరో ఐదు వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ ఆవర్తనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


మరో ఐదు రోజులు భారీ వర్ష సూచన
మరో ఐదు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ వాతావరణ పరిస్థితులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితి తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో ఈ జిల్లాలో భారీ వర్షాలు..
తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నారాయణపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు సూచిస్తున్నారు. రైతులు వ్యవసాయ కార్మికులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


ఏపీలో వాతావరణం ఇలా..
ఏపీలో కూడా మరో ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాలతో పాటు.. కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

పలు జాగ్రత్తలు..
ఈ వాతావరణ పరిస్థితులు రైతులకు సవాలుగా మారవచ్చు, ఎందుకంటే ఖరీఫ్ పంటల కోత సమయం దగ్గరపడుతోంది. భారీ వర్షాలు పంటలకు నష్టం కలిగించే అవకాశం ఉంది. అందువల్ల, రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించబడింది. అలాగే, రహదారులపై జలమయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read: యూరియా కోసం రైతుల ఆవేదన.. లారీ డ్రైవర్‌గా మారిన కానిస్టేబుల్ 

ఊరిలోకి సముద్రం..
కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో అలల ఉధృతి తగ్గడం లేదు. రోడ్డుపైకి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. అలల తాకిడికి ఇళ్ళు, బీచ్ రోడ్డు ధ్వంసమవుతున్నాయి. MPUP స్కూలులోకి సముద్రపు నీరు ప్రవేశించింది. బీచ్ రోడ్డును మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. సముద్రం పోటు మీద ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. అప్రమత్తమైన అధికారులు ముందస్తు సహయక చర్యలలో భాగంగా ఫెయిర్ ఇంజన్ ఏర్పాటు చేశారు.

Related News

DCC President Post: సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు ఎవరు?

Jubilee Hills : జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. గెలుపు డిసైడ్ చేసేది వాళ్లేనా?

Misuse of scholarship funds: స్కాలర్‌షిప్ నిధుల దుర్వినియోగంపై ఉక్కుపాదం.. విచారణకు తెలంగాణ సర్కార్ ఆదేశం

SFI: స్టూడెంట్స్‌కు అలెర్ట్.. రేపు అన్ని కాలేజీలు బంద్.. ఎందుకంటే?

Heavy Rains: భారీ వర్షాలు.. రైళ్లలో చిక్కుకున్న ప్రయాణికులను ఆదుకున్న పోలీసులు

Heavy rains: అత్యంత భారీ వర్షాలు.. రేపు స్కూళ్లకు సెలవు ఉందా..? లేదా..? ఇదిగో క్లారిటీ

Jangaon District: విద్యార్థులందరూ భోజనం చేశాక సాంబార్‌లో బల్లి ప్రత్యక్షం.. జనగామ జిల్లాలో ఘటన

RS Praveen Kumar: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. నవీన్ యాదవ్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

Big Stories

×