E-Paper
Advertisement

Telangana Bjp Candidate: బీజేపీ అభ్యర్థి మాదవీలతకు Y+ సెక్యూరిటీ.. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

Telangana Bjp Candidate: బీజేపీ అభ్యర్థి మాదవీలతకు Y+ సెక్యూరిటీ.. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు
Advertisement

Telangana Bjp Candidate: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ విరించి ఆస్పత్రి చైర్ పర్సన్ మాదవీలత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలిచినా ఏ ప్రధాన పార్టీకైనా హైదరాబాద్ సీటు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ తరుణంలోనే బీజేపీ హైదరబాద్ ఎంపీ సీటును మాదవీలతకు కట్టబెట్టింది. ఈ తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాదవీలతకు హై సెక్యూరిటీని కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాదవీలతకు వై ప్లస్ భద్రతను కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

మాదవీలత ప్రస్తుతం ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీపై పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మాదవీలతకు సెక్యూరిటీ కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మాదవీలతకు కేటాయించిన సెక్యూరిటీలో 11 మంది పోలీసు సిబ్బంది ఉండనున్నారు. మరోవైపు ఆరుగులు సీఆర్పీఎఫ్ ఆఫీసర్లు, ఐదుగురు హొంగార్డ్స్ ఉండనున్నారు.

ఇక మాదవీలత గురించి చెప్పాలంటే ఈమె యాకత్ పురాలోని సంతోశ్ నగర్ లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత చదువులు కూడా పూర్తి చేశారు. అనంతరం ఆర్టిస్ట్, ఫిలాసఫర్, భరతనాట్య నృత్యకారిణిగా, ఎంటప్రిన్యూర్ గా కూడా మాదవీలత పని చేశారు. ప్రస్తుతం ఈమె కొంతకాలంగా ఆధ్యాత్రిక కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. విరించి గ్రూప్ ఫౌండర్ కొంపెల్ల విశ్వనాథ్ ను ఈమె 2001లో పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు ఈమె లతామా ఫౌండేషన్ కు చైర్ పర్సన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈమె హిందూ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాతబస్తీలో ఈ మేరకు గోశాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో అసదుద్ధీన్ ఓవైసీని ఓడించి తాను విజయకేతనం ఎగురవేస్తానంటూ సవాల్ చేశారు మాతవీలత. ఈ నేపధ్యంలో హైదరాబాద్ ఎంపీ సీటుపై ఆసక్తి నెలకొంది.

Tags

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×