BigTV English

Uttam Kumar Reddy : 13 ఎంపీ సీట్లు గెలుస్తాం.. కేటీఆర్ కు ఉత్తమ్ కౌంటర్..

Uttam Kumar Reddy : 13 ఎంపీ సీట్లు గెలుస్తాం.. కేటీఆర్ కు ఉత్తమ్ కౌంటర్..
Uttam Kumar Reddy

Uttam Kumar Reddy : మేడిగడ్డ బ్యారేజ్‌ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నిప్పులు చెరిగారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల నాటికి మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వస్తుందని చెప్పారు. ప్రాథమిక విచారణ నివేదిక తనకు ఇంకా అందలేదన్నారు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్‌పై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఇంకా అనుకోనట్లు వెల్లడించారు.


వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి 13 ఎంపీ సీట్లు వస్తాయని అన్నారు. ఎంపీ ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ ఉనికి కష్టమేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.

మాజీమంత్రి కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మెజారిటీ సీట్లు వస్తాయన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. కేటీఆర్ భ్రమల్లో బతకడం మానేసి, వాస్తవంలోకి రావాలని చురకలు అంటించారు మంత్రి ఉత్తమ్‌.


Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×