Secretary Corruption: స్వేచ్ఛ బ్యూరో: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతీపురం గ్రామ కార్యదర్శిగా గతంలో మూడేళ్ల పాటు పనిచేసి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన సోమిడి గాయత్రి తిరిగి బదిలీపై వచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని ఈ అధికారిని తమ గ్రామానికి నియమించొద్దని సోమవారం గ్రామస్తుడు దాసరి కుమార్, ఇతరులతో కలిసి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడారు.
గతంలో గాయపడిన పని చేసిన గాయత్రి సుమారు 78 లక్షల నిధులకు పైగా దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. అక్రమ లేఔట్లలో ఫ్లాట్లను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టిందని మండిపడ్డారు. గ్రామపంచాయతీకి కేటాయించిన ట్రాక్టర్ కు రిజిస్ట్రేషన్ పేరిట1.45 లక్షలను డ్రా చేసినట్లు తెలిపారు. అవంతీ పురంలోని ప్రభుత్వ భూములకు ఇంటి నెంబర్లు అక్రమంగా ఇచ్చి కబ్జాలను ప్రోత్సహించింది అని ఆరోపించారు.
Also read: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..నేడు TGPSC నుంచి 3 నోటిఫికేషన్లు!
ఇంటి పన్నుల వసూళ్లలోనూ నకిలీ రసీదులు ఇచ్చి ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చిందని ఆరోపిస్తూ వినతి పత్రం అందజేశారు. నిజాయితీ కలిగిన ఆఫీసర్లను కాదని గ్రామపంచాయతీ నిధులకు, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే ల విధులు నిర్వర్తించే గాయత్రీ దేవిని అవంతీ పురం గ్రామ కార్యదర్శిగా నియమిస్తే గ్రామస్తుల నుంచి తిరుగుబాటు తప్పదని అధికారులు సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Also read: వేసవిలో వేడి వల్ల మేకప్ త్వరగా చెడిపోతోందా? ఎక్కువ సమయం ఉండేందుకు బ్యూటీ టిప్స్