Weather Updates in Telangana: గత కొద్ది రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రత్తలు, వేడిమితో ప్రజలు సతమతమవుతున్నారు. ఉదయం 8 అయ్యిందంటే చాలు ఎండలు ప్రారంభమవుతున్నాయి. సాయంత్రం ఐదారు గంటల వరకు కూడా ఎండ వేడిమి తగ్గడం లేదు. ఇటు రాత్రి సమయంలో ఉక్కపోత. ఇలా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో వాతావరణ శాఖ ఓ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా పలు చోట్ల వేడి, తేమతో కూడిన పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది.
వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో నేడు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని చోట్లా ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ తోపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Also Read: తెలంగాణ లోక్ సభ బరిలో తమిళ పార్టీ.. ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తుందంటే?
మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. అదేవిధంగా మరికొన్ని చోట్లా మాత్రం వేడి, తేమతో కూడిన పరిస్థితులు అలాగే కొనసాగుతాయని తెలిపింది.