BigTV English

Ys Sharmila: ఆపిన చోటు నుంచే వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పున:ప్రారంభం

Ys Sharmila: ఆపిన చోటు నుంచే వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పున:ప్రారంభం

Ys Sharmila: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభంకానుంది. పాదయాత్ర ఆపిన చోట నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభించనున్నారు.


అయితే పాదయాత్రకు వెళ్లే ముందు షర్మిల మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ తమిళసైతో భేటీ కానున్నారు. పాదయాత్ర వివరాలతో పాటు గతంలో తన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, బీఆర్ఎస్ కార్యకర్తల దాడి గురించి గవర్నర్‌కు వివరించనున్నట్లు సమాచారం. అలాగే ప్రజల సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇక పాదయాత్రలో భాగంగా 4 గంటలకు షర్మిల లింగగిరి గ్రామప్రజలతో మాట్లాడనున్నారు. 4.30 గంటలకు సూరిపల్లిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు తొప్పనగడ్డ తాండా ప్రజలతో ముచ్చటించి.. 5.30 గంటలకు నెక్కొండ మండల కేంద్రంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించనున్నారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×