BigTV English

Good News For Employees: ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం..

Good News For Employees: ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం..

Good News For Employees ( Andhra news updates ) : ఏపీ సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరికి హెచ్ఆర్ఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్నటువంటి 16 శాతం హెచ్ఆర్ఏను 24 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మొత్తం రూ. 25 వేలకు మించకుండా వర్తింపజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, 12వ పీఆర్శీ సిఫార్సులను ఇంకా రానుందన.. 2025 జూన్ వరకు ఈ హెచ్ఆర్ఏను అమలు చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


Also Read: ఏపీలో త్వరలో కొత్త ల్యాండ్ పాసు పుస్తకాల పంపిణీ

ఇదిలా ఉంటే.. పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకాడమిక్ క్యాలెండర్ ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఆ తరువాత విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గవర్నమెంట్ స్కూల్స్ ను రాజకీయాలకు అతీతంగా ఉంచాలని అధికారులకు సూచించినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల పదవీకాలం ఈ నెలతో పూర్తయ్యింది. ఆగస్టులో కమిటీల ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులకు సూచించా. అదేవిధంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం క్వాలిటీ, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచిగ్ పోస్టుల భర్తీకి సంబంధించి విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా అధికారులకు సూచించాను’ అంటూ లోకేష్ పేర్కొన్నారు.


Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×