Bullet Train vs Flight: దూర ప్రయాణాలకు వెళ్లే వారు సాదారణంగా ట్రైన్లోనే ప్రయాణిస్తారు. ఇంకాస్త దూరం ఎక్కువగా ఉందంటే కొంచం ఖర్చు ఎక్కువైనా ఫరవాలేదు విమానంలో వెళ్లాలని అనుకుంటారు. అయితే విమానంలో వెళ్లాలంటే కాస్త ఖర్చు ఎక్కువే ఉంటుంది. దీంతో ట్రైన్లో ప్రయాణించేందుకు చాలా మంది మొగ్గు చూపుతారు. కానీ, దీనికి కూడా తక్కువ ఖర్చు ఏం అవ్వదు. ట్రైన్ కోసం పెట్టే ఖర్చుతో సుఖంగా విమానంలో ప్రయాణించొచ్చు కదా అని అందరూ అనుకుంటారు. దీంతో ఇండియాలో బుల్లెట్ ట్రైన్ అవసరమా అనిపిస్తుంది. ఈ విషయంపై చర్చిస్తే, దాని ప్రయోజనాలు, ఖర్చులు, ఇతర ఆప్షన్లను చూడాలి.
బుల్లెట్ ట్రైన్ ఎందుకు అవసరం?
బుల్లెట్ ట్రైన్ గంటకు 300-350 కి.మీ. వేగంతో పరిగెడుతుంది. రోడ్డు లేదా నార్మల్ రైలు కంటే బాగా ఫాస్ట్. ఉదాహరణకు, ముంబై-అహ్మదాబాద్ (508 కి.మీ) బుల్లెట్ ట్రైన్లో 2-3 గంటల్లో వెళ్తాం, కానీ సాధారణ రైలులో 7-8 గంటలు పడుతుంది.
సమయం తగ్గితే బిజినెస్, టూరిజం, జాబ్ అవకాశాలు పెరుగుతాయి. జపాన్లో షింకన్సెన్ ట్రైన్లు ఎలా ఎకానమీని లేపాయో, ఇక్కడ కూడా అలాంటి డెవలప్మెంట్ జరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.
విమానాలతో పోలిస్తే బుల్లెట్ ట్రైన్లు తక్కువ కార్బన్ విడుదల చేస్తాయి. లాంగ్ రన్లో ఇది ఎన్విరాన్మెంట్కి ప్లస్ అని చెప్పుకోవచ్చు.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్లతో రైల్వే ట్రాక్లు, స్టేషన్లు, టెక్నాలజీ మెరుగవుతాయి. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొత్తం లెవెలప్ అవుతుందట.
ట్రైన్ vs విమానం
బుల్లెట్ ట్రైన్ టికెట్ ధర విమాన టికెట్తో సమానంగా ఉండొచ్చట. ఉదాహరణకు, ముంబై-అహ్మదాబాద్ ట్రైన్ టికెట్ సుమారు రూ.3,000-రూ5,000 అని అంచనా. బడ్జెట్ ఫ్లైట్ కూడా ఇంచుమించు అంతే.
విమానం 1 గంటలో వెళ్లినా, ఎయిర్పోర్ట్ చెక్-ఇన్, సెక్యూరిటీ, ట్రాఫిక్ కలిపితే 3-4 గంటలు అవుతుంది. బుల్లెట్ ట్రైన్ సిటీ సెంటర్ నుంచి డైరెక్ట్గా వెళ్తుంది, సో టైమ్ సేవ్ అవుతుంది.
బుల్లెట్ ట్రైన్లో స్పేసియస్ సీట్స్, మోడరన్ ఫెసిలిటీస్, స్ట్రెస్ లెస్ జర్నీ ఉంటుంది. విమానాల్లో సీట్స్ ఇరుక్కుపోయి, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది.
జపాన్లో బుల్లెట్ ట్రైన్లు సెకన్కి సెకన్ షెడ్యూల్ ఫాలో అవుతాయి. విమానాలు వెదర్ లేదా ఇతర కారణాల వల్ల లేట్ అవ్వొచ్చు.
బుల్లెట్ ట్రైన్ మిడిల్ క్లాస్ ఫోకస్తో ఉంటుంది. విమాన టికెట్స్ కొంచెం ఖరీదుగా ఫీల్ అవుతాయి. సో, బుల్లెట్ ట్రైన్ హై-స్పీడ్ ట్రావెల్ని సామాన్యులకు దగ్గర చేస్తుంది.
ప్రాబ్లమ్స్ ఏంటి?
ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్ట్కి సుమారు రూ. 1.08 లక్షల కోట్లు ఖర్చు. ఇది గవర్నమెంట్ బడ్జెట్పై లోడ్ పడే ఛాన్స్ ఉంది. బుల్లెట్ ట్రైన్ టికెట్స్ అందరికీ అఫోర్డబుల్ కాకపోవచ్చు. దీనివల్ల యూసేజ్ లిమిట్ అవొచ్చు.
బుల్లెట్ ట్రైన్లు ఇండియా లాంగ్-టర్మ్ ట్రాన్స్పోర్ట్ నీడ్స్కి బాగా వర్కౌట్ అవుతాయి. ముఖ్యంగా జనసాంద్రత, బిజినెస్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో. విమానాలతో టికెట్ ధర సమానంగా ఉన్నా, టైమ్ సేవింగ్, కంఫర్ట్, ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్ వల్ల బుల్లెట్ ట్రైన్ అట్రాక్టివ్. కానీ, ఖర్చు అందరికీ అఫోర్డబుల్గా ఉండాలంటే గవర్నమెంట్ సబ్సిడీలు లేదా స్మార్ట్ ప్లాన్స్ వాడాలి.