E-Paper
Advertisement

Monorail Derails: ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు.. మరి ప్రయాణికులు?

Monorail Derails: ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు.. మరి ప్రయాణికులు?
Advertisement

Train Accidents:

దేశంలో వరుస రైలు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఛత్తీస్ గఢ్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో 11 మంది చనిపోగా, ఇవాళ ఉదయం ఉత్తర ప్రదేశ్ లో పట్టాలు దాటుతున్న ప్రయాణీకులను ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు స్పాట్ డెడ్ అయ్యారు. తాజాగా ముంబైలో మరో రైలు ప్రమాదం జరిగింది. మోనో రైలు పట్టాలు తప్పింది. వెంటనే స్పాట్ కు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఇవాళ ఉదయం వడాలా డిపోలో టెస్ట్ రన్ సమయంలో ముంబై మోనోరైల్ రైలు ఓ వైపు వంగిపోయింది. ఈ రైలులో ప్రయాణికులు ఎవరూ లేరు. లోకో పైలెట్స్ కు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. రెస్క్యూ సిబ్బంది వారిద్దరిని  సురక్షితంగా బయటకు తీశారు. సిగ్నలింగ్ ట్రయల్స్ సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంతో కొంత మేర ట్రాక్ దెబ్బతిన్నది. పదే పదే వస్తున్న సాంకేతిక సమస్యల కారణంగా మోనోరైల్ సేవలను అధికారులు ఇప్పటికే నిలిపివేశారు.  ఈ ఘటనకు సంబంధించి అధికారులు స్పందించారు. “ఇవాళ ఉదయం ముంబైలోని వడాలా డిపోలో టెస్ట్ రన్ సమయంలో మోనోరైల్ రైలు వంగిపోయింది. ప్రమాద సమయంలో ఇద్దరు లోకో పైలెట్లు మాత్రమే ఉన్నారు. రైలు లోపల ప్రయాణికులు లేరు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, కొంత మేర ట్రాక్ దెబ్బతిన్నది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్వరలోనే దెబ్బతిన్న ట్రాక్ ను సరిచేస్తాం” అని అధికారులు తెలిపారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

Advertisement

అటు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రైలు ఒకవైపు వంగిపోయినట్లు కనిపిస్తోంది. ఉదయం 9 గంటలకు ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మోనో రైల్ లోకో పైలెట్స్ ను రక్షించినట్లు తెలిపారు.

 సాంకేతిక సమస్యల కారణంగా సర్వీసులు నిలిపివేత

Advertisement

నిజానికి పదే పదే టెక్నికల్ సమస్యలు రావడంతో ముంబైలో మోనోరైల్ సేవలను సెప్టెంబర్ 20 నుంచి నిలిపివేశారు. సిస్టమ్ అప్‌గ్రేడేషన్ పనుల కోసం తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 15, ఆగస్టు 19న వేర్వేరు ప్రదేశాలలో రెండు మోనోరైళ్లలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. మార్గం మధ్యలోనే ఆగిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు మోనో రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారుతు తెలిపారు.

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×