E-Paper
Advertisement

రూ. 23,437 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఏపీ, తెలంగాణకు గుడ్ న్యూస్!

రూ. 23,437 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..  ఏపీ, తెలంగాణకు గుడ్ న్యూస్!
Advertisement

Railway Network Expansion Across 6 States: దేశంలో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ. 23,437 కోట్ల వ్యయంతో మూడు పెద్ద రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా భారతీయ రైల్వే నెట్‌ వర్క్‌కు సుమారు 900 కిలోమీటర్ల అదనపు లైన్లు యాడ్ కానున్నాయి. రద్దీ తగ్గించడం, రైళ్ల రాకపోకలను వేగవంతం చేయడం, సరుకు రవాణాను మెరుగుపరచమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని ప్రధాన రైల్వే మార్గాల్లో భారీ రద్దీ కొనసాగుతోంది. దీనివల్ల ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకల్లో ఆలస్యం జరుగుతోంది. ఈ సమస్యలను తగ్గించేందుకు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్తగా ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఇవే!

తాజాగా కేంద్రం ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో నాగ్దా–మధుర, గుంతకల్–వాడి, బుర్హ్వాల్–సీతాపూర్ మార్గాల్లో మూడవ,  నాల్గవ రైల్వే లైన్లను నిర్మించనున్నారు. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే రైల్వే నెట్‌ వర్క్ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులు ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అమలు చేయబడుతున్నాయి. రోడ్డు, రైలు, ఇతర రవాణా వ్యవస్థల మధ్య మెరుగైన అనుసంధానం కల్పించడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. దీని వల్ల సరుకు రవాణా మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుంది.

6 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు పనులు

Advertisement

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 జిల్లాల్లో ఈ ప్రాజెక్టులు అమలు కానున్నాయి. మొత్తం 4,161 గ్రామాలకు ఈ ప్రాజెక్టుల వల్ల ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దాదాపు 83 లక్షల మంది ప్రజలు ఈ అభివృద్ధి వల్ల లాభపడే అవకాశం ఉంది. ఈ విస్తరణలతో పర్యాటక రంగానికీ మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మహాకాలేశ్వర ఆలయం, రణతంబోర్ నేషనల్ పార్క్, కియోలాడియో జాతీయ పార్క్, మధుర లాంటి ముఖ్య ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. పర్యాటకుల ప్రయాణం సులభంగా మారే అవకాశం ఉంది.

సరకు రవాణాకు అత్యంత కీలకం

సరుకు రవాణా పరంగా కూడా ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి. బొగ్గు, సిమెంట్, ఉక్కు, ఆహార ధాన్యాలు వంటి వస్తువుల రవాణా వేగవంతం అవుతుంది. ప్రభుత్వం అంచనా ప్రకారం, సంవత్సరానికి అదనంగా సుమారు 6 కోట్ల టన్నుల సరుకును రవాణా చేసే సామర్థ్యం ఏర్పడుతుంది. రైల్వే రవాణా పెరగడం వల్ల చమురు వినియోగం కూడా తగ్గుతుంది. దీని ద్వారా దేశానికి భారీగా ఇంధన దిగుమతి ఖర్చు ఆదా అవుతుంది. ప్రభుత్వం లెక్కల ప్రకారం, సుమారు 37 కోట్ల లీటర్ల చమురు వినియోగం తగ్గే అవకాశం ఉంది. అలాగే కర్బన ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గి పర్యావరణానికి మేలు కలగనుంది.

Advertisement

Read Also: ప్రపంచంలో తొలి లేడీస్ స్పెషల్ ట్రైన్.. స్ఫూర్తిదాయక ప్రయాణానికి 34 ఏళ్లు!

Related News

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

Big Stories

Advertisement
×