CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిరాడంబరతను మరోసారి చాటుకున్నారు. ముఖ్యమంత్రులు.. వివిఐపిల పర్యటనల సమయంలో గంటల తరబడి సామాన్య జనం ట్రాఫిక్లో ఇరుక్కుపోయే సంస్కృతికి ఆయన స్వస్తి పలికారు. గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్లోని తన నివాసం వరకు సీఎం కాన్వాయ్ ఎటువంటి ముందస్తు ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా సాధారణ వాహనాల మధ్యే పయనించింది. తన కాన్వాయ్ కోసం రోడ్లపై వాహనాలను నిలిపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని నిన్ననే ఆయన పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సాధారణ ట్రాఫిక్ లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్
శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్ లోనే పయనించిన సీఎం.
తన కాన్వాయ్ కోసం సిటీలో వాహనాలను నిలిపివేయడంపై పోలీస్ ఉన్నతాధికారులకు నిన్న స్పష్టమైన ఆదేశాలిచ్చిన సీఎం
ప్రజలకు రోడ్లపై ఇబ్బందులు కలిగించే… pic.twitter.com/xcXThOef6A
— ChotaNews App (@ChotaNewsApp) May 7, 2026
Read Also: మాతో పెట్టుకోకు..! సీఎం కాకముందే తన విశ్వరూపం చూపిన బీజేపీ! ఓడిందెవరు?