Indian Railway Viral Video: సాధారణం రైల్వేకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతుంటాయి. సీట్ల కోసం కొట్లాడుకోవడం, ఫుడ్ కంప్లైంట్స్, టికెట్ లేని ప్రయాణాలకు సంబంధించిన వీడియోలు తరచుగా నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. కానీ, తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తాజాగా ఓ రైల్లోని వాష్ రూమ్ ను ఒక జంట మిస్ యూజ్ చేసిన ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఒక యువ జంట రైల్వే టాయిలెట్ లోకి కలిసి వెళ్లిన దృశ్యాలు కనిపించడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజా ప్రదేశాల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదంటూ చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..
బ్లాక్ శారీ.. రెడ్ బ్లౌజ్.. లూజ్ హెయిర్ తో ఉన్న ఓ అందమైన మహిళ కనిపిస్తుంది. ఎదురుగా ఉన్న యువకుడిని రమ్మని సైగ చేస్తూ, రైల్లోని టాయిలెట్ కు వెళ్తుంది. ఆమె వెళ్లిన కాసేపటికే, సదరు యువకుడు ఆమెతో పాటు లోపలికి వెళ్లి డోర్ వేయడం కనిపిస్తుంది. ఈ తతంగం అంతా చుట్టుపక్కల వాళ్లు చూస్తూనే ఉన్నారు. అయినా, వాళ్లు అందరు చూస్తుండగానే లోపలికి వెళ్లారు. ఈ ఘటనను ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాసేపట్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
🚨भारतीय रेलवे में आपका स्वागत है, यहां आप खाने पीने के साथ साथ वाशरूम का उपयोग (OYO) के रूप में कर सकते हैं।🚨
आपकी यात्रा शुभ हो 💀
Why railway not take action against that type people 🤔 pic.twitter.com/n0luHH17ob
— Pandit Brijendra Shukla Principal National Secret (@satya_1766) May 15, 2026
వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అందరూ చూస్తుండగానే అలా వాష్ రూమ్ లోకి వెళ్లడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. రైల్వే టాయిలెట్ ను ఓయో రూమ్ లా మార్చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు “భారతీయ రైల్వేకు స్వాగతం.. ఇక్కడ ఫుడ్, వాటర్ మాత్రమే కాదు, ఓయో రూమ్ లు కూడా రెడీగా ఉన్నాయి” అంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి ఘటనలపై రైల్వే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు.
ఈ వీడియో ఏ రైలులో జరిగింది అనేది కచ్చితంగా తెలియదు. ఎప్పుడు జరిగిందో స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. అయితే, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్ ఫారమ్ లలో వేలాది మంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. రోజూ లక్షలాది మంది ప్రయాణించే రైళ్లలో అందరూ రూల్స్ పాటించాలంటున్నారు. ఇలాంటి వారివల్ల ఇతర ప్రయాణికులకు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రైల్వే భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ముఖ్యంగా సుదూర రైళ్లలో టిటిఈలు, ఆర్పీఎఫ్ సిబ్బంది తరచుగా తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని అంటున్నారు. కొందరు ప్రయాణికులు రైల్వే టాయిలెట్ల దగ్గర సీసీ కెమెరాల పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడుతున్నారు.
Read Also: జారి బయటపడేవురా అయ్యా.. జీపు గోవిందా.. జీపులోని మనుషులు గోవిందా!