E-Paper
Advertisement

Ghost Railway Station: అక్కడ అడుగు పెడితే ప్రాణాలు పోయినట్టే, దేశంలోనే భయంకరమైన ఘోస్ట్ రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసా?

Ghost Railway Station: అక్కడ అడుగు పెడితే ప్రాణాలు పోయినట్టే, దేశంలోనే భయంకరమైన ఘోస్ట్ రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసా?

Begunkodar Railway Station: దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ల మీదుగా రోజూ 20 వేలకు పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. కోట్లాది మంది ప్రయాణీకులు జర్నీ చేస్తున్నారు. వేలాది మంది రైల్వే ఉద్యోగులు పని చేస్తున్నారు. కానీ, ఓ రైల్వే స్టేషన్ పేరు వింటే, ప్రయాణీకులతో పాటు రైల్వే ఉద్యోగులు భయంతో వణికిపోతారు. అక్కడి పని చేసేందుకు ఏ రైల్వే ఉద్యోగి ముందుకురారు. ఒకవేళ ఎవరైనా ధైర్యంగా వెళ్లినా ప్రాణాలతో ఉండేవాళ్లు కాదు. ఈ చావులకు కారణం ఓ దయ్యం అని, రైల్వే స్టేషన్ కు వచ్చే వారిని పగబట్టి చంపేస్తుందనే ప్రచారం ఉంది. చివరకు ఓ ఘోస్ట్ రైల్వే స్టేషన్ గా ముద్ర వేసుకుంది. అక్కడ పని చేసేందుకు ఉద్యోగులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూతపడింది. ఇంతకీ ఈ స్టేషన్ ఎక్కడ ఉంది? ఎందుకు దెయ్యం స్టేషన్ గా గుర్తింపు పొందాల్సి వచ్చింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బేగుంకోదర్ రైల్వే స్టేషన్ వెనుక అసలు కథ

దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే ఉద్యోగుల వెన్నులో వణుకు పుట్టించిన ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌ లో ఉంది. పురిలియా జిల్లాలోని మారుమూల ప్రాంతంలో  ఉంటుంది ఈ బేగుంకోదర్ రైల్వే స్టేషన్. ఇండియన్ రైల్వే సైతం తన రికార్డులలోనూ దీనిని హాంటెడ్ స్టేషన్ గా పేర్కొన్నది. ఈ రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి తెల్లటి దుస్తులు ధరించిన ఓ మహిళ దర్శనం ఇస్తుందని, ఆ దయ్యమే చాలా మంది ప్రాణాలు తీసిందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం కారణంగా గత 42 ఏండ్లుగా మూతబడింది. ఇప్పటికీ రాత్రిపూట ఈ రైల్వే స్టేషన్ వైపు వెళ్లాలంటేనే భయపడతారు.

1960లో బేగుంకోదర్ రైల్వే స్టేషన్ నిర్మాణం

ఈ రైల్వే స్టేషన్ ను 1960లో నిర్మించారు. స్థానిక ప్రజలు ఈ రైల్వే స్టేషన్ ద్వారా ప్రయాణాలు కొనసాగించేవారు. తమ సరుకులను రవాణా చేసుకునే వారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ, ఈ స్టేషన్ లో ఓ ఆడ దయ్యం తిరుగుతుందనే ప్రచారం మొదలయ్యింది. రైలు పట్టాల మీద నడుచుకుంటూ వస్తున్న మహిళా దయ్యాన్ని చూసి ఈ రైల్వే స్టేషన్ మాస్టర్ చనిపోయాడని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను రైల్వే అధికారులు తొలుత కొట్టిపారేశారు. కానీ, ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ కుటుంబ సభ్యులు సైతం అనుమానాస్పద రీతిలో మృతి చెందడంతో ప్రజల్లో భయం పెరిగింది.

స్టేషన్ ను మళ్లీ తెరిపించాలని భావించినా.. 

ఈ రైల్వే స్టేషన్ లో పని చేసేందుకు ఉద్యోగులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ మూతపడింది. ఇక మమతా బెనర్జీ రైల్వే మంత్రి అయ్యాక 2009లో ఈ స్టేషన్ ను మళ్లీ తెరిపించారు. అయితే, సాయంత్రం 5 తర్వాత ఈ స్టేషన్ లో ఎవరూ ఉండేవారు కాదు. ఈ మరణాల వెనుక మిస్టరీని కనిపెట్టేందుకు కొంత మంది హేతువాదులు ప్రయత్నించారు. ఓ రోజు రాత్రిస్టేషన్ లోనే బస చేశారు. పర్యాటకులను దోచుకోవడానికి కొంత మంది స్థానికులు దెయ్యం ఉందనే ప్రచారం చేశారని తేల్చారు. అయినప్పటికీ, ఇక్కడ పని చేయాలంటే రైల్వే ఉద్యోగులు భయపడతారు. ఈ స్టేషన్ లో పెద్దగా రైళ్లు కూడా ఆగవు.

Read Also: దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలు.. ఏకబిగిన అన్ని కిలో మీటర్లు వెళ్తుందా?

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×