Bangalore: బెంగళూరు సమీపంలో చలికాలంలో.. వాతావరణం మరింత చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయం రోడ్డు ప్రయాణాలు చేయడానికి, అద్భుతమైన ప్రదేశాలను సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు కూడా బెంగళూరుకు దగ్గరగా ఉన్న కొన్ని అందమైన ప్రదేశాలను చూడాలని అనుకుంటున్నారా ? అయితే ఈ ప్లేస్లు అస్సలు మిస్సవ్వకండి.
1. నంది హిల్స్ :
నంది హిల్స్ బెంగళూరుకు అత్యంత సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది చలికాలంలో ఉదయించే సూర్యుడిని చూడటానికి ప్రసిద్ధి చెందింది.
చలికాలంలో ఇక్కడ తెల్లవారుజామున మంచు దట్టంగా కమ్ముకుని ఉంటుంది. సూర్యుడు ఉదయించే సమయంలో మంచు తెరల వెనుక నుంచి వచ్చే బంగారు కిరణాలు అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. బెంగళూరు నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో నంది హిల్స్ ఉంటుంది.
2. కూర్గ్ – భారతదేశ స్కాట్లాండ్
దట్టమైన పచ్చని కాఫీ తోటలు, కొండలు, జలపాతాలతో కూడిన కూర్గ్ చలికాలంలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలలో కూర్గ్ ఒకటి. చలికాలంలో ఇక్కడి వాతావరణం చల్లగా, పొగమంచుతో ఉండి.. పరిసరాలకు అద్భుతమైన అందాన్ని ఇస్తుంది. అంతే కాకుండా కాఫీ తోటల్లోని సువాసన, ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతలు అద్భుతంగా ఉంటాయి.
కూర్గ్లో అబ్బీ జలపాతం , రాజా సీట్ నుంచి సూర్యాస్తమయం, గోమఠేశ్వర ఆలయం, కావేరి నది జన్మస్థానం తలకావేరి వంటి అద్భుతమైన ప్రదేశాలు ఉంటాయి.
3. మైసూర్ – సాంస్కృతిక రాజధాని:
చారిత్రక వైభవం, అద్భుతమైన నిర్మాణ శైలి, గొప్ప సంస్కృతి కలిగిన మైసూర్ చలికాలంలో చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.
చలికాలంలో ఈ ప్రదేశంలో సాయంత్రం చల్లగా, హాయిగా ఉంటుంది. ఈ సమయంలో మైసూర్ ప్యాలెస్ రాత్రిపూట విద్యుద్దీపాలతో మెరిసిపోవడం ఒక కన్నుల పండగగా ఉంటుంది. చల్లని వాతావరణం రోజు మొత్తం ప్యాలెస్, జూ, వృందావన్ గార్డెన్స్ వంటివి చూడటానికి అనుకూలంగా ఉంటుంది. మైసూర్ బెంగళూరు నుంచి సుమారు 150 కిలోమీటర్లు. మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్, చాముండి కొండలు, మైసూర్ జూ వంటివి చాలా ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు.
4. హంపి: – రాళ్ల మధ్య చరిత్ర
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన హంపి, విజయనగర సామ్రాజ్యం యొక్క శిథిలాలకు ప్రసిద్ధి. ఇక్కడ వేసవి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి.. చలికాలం ఈ ప్రదేశాన్ని చూడటానికి మంచి సమయం. చలికాలంలో ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రత రోజు మొత్తం పురాతన ఆలయాలను, స్మారక కట్టడాలను ప్రశాంతంగా చూడటానికి వీలు కల్పిస్తుంది. బెంగళూరు నుంచి సుమారు 340 కిలోమీటర్ల దూరంగా హంపి ఉంటుంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయం , తుంగభద్ర నది తప్పకుండా చూడాలి.
Also Read: రూ.3వేలలోపే గోవా ట్రిప్, బుకింగ్లు స్టార్ట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు..
5. వయనాడు – కేరళ అందాలు:
కేరళలోని ఈ ప్రసిద్ధ పర్వత ప్రాంతం దట్టమైన అడవులు, టీ తోటలు, చారిత్రక గుహలకు ప్రసిద్ధి. చలికాలంలో ఉష్ణోగ్రతలు 10°C కంటే తక్కువగా పడిపోతాయి. ఇది విపరీతమైన వేడిని కోరుకోని వారికి అద్భుతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ చల్లని, నిర్మలమైన వాతావరణం ట్రెక్కింగ్కు అనుకూలంగా ఉంటుంది. బెంగళూరు నుంచి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో వయనాడు ఉంటుంది. ఎడక్కల్ గుహలు , సూచిపారా జలపాతం , వయనాడు హెరిటేజ్ మ్యూజియం ఇక్కడ తప్పకుండా చూడాలి.