E-Paper
Advertisement

గుడ్ న్యూస్.. హైదరాబాద్ to విజయవాడ జస్ట్ 4 గంటల్లోనే, ఈ రైలు వేగం ఎంతో తెలుసా?

గుడ్ న్యూస్.. హైదరాబాద్ to విజయవాడ జస్ట్ 4 గంటల్లోనే, ఈ రైలు వేగం ఎంతో తెలుసా?

India’s first Bullet Train: భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వందేభారత్ ఎక్స్ ప్రెస్ పేరుతో ప్రయాణీకులకు సేవలను అందిస్తున్నాయి. వందేభారత్ మెట్రో, వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కబోతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. గంటకు ఏకంగా 280 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు రెడీ అవుతున్నట్లు పార్లమెంట్ వేదికగా వెల్లడించారు.

చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో బుల్లెట్ రైలు తయారీ

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ..  BEML సహకారంతో బుల్లెట్ రైలును రెడీ చేస్తున్నది. దీనిని గంటకు 280 కి. మీ వేగంతో ప్రయాణించేలా హై-స్పీడ్ రైలు సెట్లను రూపొందిస్తున్నట్లు  రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రూపొందించిన వందేభారత్ రైళ్లు విజయవంతం కావడంతో,  ఇప్పుడు హై-స్పీడ్ రైళ్ల తయారీ మీద ఫోకస్ పెట్టినట్లు చెప్పారు.

అత్యాధునిక టెక్నాలజీతో రూపొందుతున్న బుల్లెట్ రైలు

ఇక హై-స్పీడ్ రైళ్ల తయారీ అత్యంత సంక్లిష్టతతో కూడుకున్న వ్యవహారం అన్నారు రైల్వే మంత్రి వైష్ణవ్. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏరోడైనమిక్, ఎయిర్‌ టైట్ కార్ బాడీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైలు సెట్ల బరువు ఆప్టిమైజేషన్, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సరికొత్తగా ఉండబోతుందన్నారు.  “రైలు సెట్లలో ఏరోడైనమిక్ ఎక్స్‌ టీరియర్స్, సీల్డ్ గ్యాంగ్‌ వేలు, ఆటోమేటిక్ డోర్లు, కంపార్ట్‌ మెంట్లలో ప్రయాణీకుల సౌకర్యం కోసం అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, సిసిటీవీలు, మొబైల్ ఛార్జింగ్ సౌకర్యాలు, చక్కటి లైటింగ్, ఫైర్ సేఫ్టీ ఎక్యుప్ మెంట్స్ లాంటి బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో కూడిన చైర్ కార్లు ఉంటయి” అని వెల్లడించారు. పూర్తి స్థాయి డిజైన్ ఖరారు చేసిన తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.

జపాన్ టెక్నాలజీ సాయంతో బుల్లెట్ రైలు తయారీ

గంటకు 280 కి.మీ ప్రయాణించే బుల్లెట్ రైలు జపాన్ టెక్నాలజీతో రూపొందుతున్నట్లు కేంద్రమంద్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రైలును ముంబై-అహ్మదాబాద్ నడుమ నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు ఈ హై స్పీడ్ రైలు (MAHSR) ప్రాజెక్ట్‌ కు సంబంధించి ఇప్పటివరకు 336 కి.మీ పీర్ ఫౌండేషన్, 331 కి.మీ పీర్ నిర్మాణం, 260 కి.మీ గిర్డర్ కాస్టింగ్, 225 కి.మీ గర్డర్ లాంచింగ్ పనులు పూర్తయినట్లు వెల్లడించారు. అటు సముద్రగర్భంలో టన్నెల్ (సుమారు 21 కి.మీ) పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు.  508 కిలోమీటర్ల పొడవైన MAHSR ప్రాజెక్ట్‌ లో ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, బరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతిలో 12 స్టేషన్లను నిర్మించాలని భావిస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రైలు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడకు జస్ట్ నాలుగు గంటల్లోనే చేరుకోవచ్చు.

Read Also: కాశ్మీర్ ‘వందే భారత్’ రైల్‌లో ఏసీతోపాటు ఇవి కూడా ఉంటాయట – లేకపోతే గజగజలాడాల్సిందే!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×