E-Paper
Advertisement

Private Railway Station: దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్.. దీని ముందు ఎయిర్ పోర్ట్ దిగదుడుపే!

Private Railway Station:  దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్.. దీని ముందు ఎయిర్ పోర్ట్ దిగదుడుపే!

Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా కొనసాగుతోంది. మొత్తం 20 వేలకు పైగా రైళ్లు, సుమారు లక్ష కిలో మీటర్ల రైల్వే లైన్లను కలిగి ఉంది. దేశ వ్యాప్తంగా 7400 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అయితే, తేజస్ లాంటి కొన్ని రైళ్లు ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నాయి. ప్రస్తుతం కొన్ని రైల్వే స్టేషన్ల నిర్వహణ బాధ్యతలు కూడా ప్రైవేట్ సంస్థలు తీసుకున్నాయి. అలాంటి వాటిలో ఒకటి భోపాల్‌లోని రాణి కమలపతి స్టేషన్. రీసెంట్ గానే ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తయ్యింది. గతంలో హబీబ్‌ గంజ్ స్టేషన్‌ అని పిలువగా, కొద్ది కాలం క్రితమే దీని పేరు మార్చారు. దేశంలో తొలిసారి ప్రైవేట్ నిర్వహణలో కొనసాగుతున్న రైల్వే స్టేషన్ గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, ఈ రైల్వే స్టేషన్ ప్రయాణీకులకు ఎయిర్ పోర్టు మాదిరి సర్వీసులను అందిస్తోంది.

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో నడుస్తున్న రైల్వేస్టేషన్!

భోపాల్‌ లో ఉన్న రాణి కమలపతి స్టేషన్ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కింద నిర్వహించబడుతుంది. ఇండియన్ రైల్వే యాజమాన్యంలో ఉన్నా, ప్రైవేట్ సంస్థ సాధారణ కార్యకలాపాలు,  నిర్వహణకు బాధ్యతలు చేపడుతుంది. ఇండియన్ రైల్వేస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ తో కలిసి బన్సాల్ గ్రూప్ ఈ స్టేషన్ బాధ్యతలను నిర్వహిస్తుంది.

మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలు

ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు ప్రయాణీకులను ఆకట్టుకుంటున్నాయి. క్లైమేట్ కంట్రోల్ మెయిన్ హాల్, రాపిడ్ ఎలివేటర్లు, నిరంతర విద్యుత్ సరఫరా, డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్రయాణీకులకు  షెల్టర్డ్ పార్కింగ్, రిటైల్ సంస్థలు, ఫుడ్ అవుట్ లెట్లు, మీటింగ్ హాల్స్, బిజినెస్ ఫెసిలిటీస్, ప్రయాణీకులకు వసతిని అందించే స్టేషన్ హోటల్ ఆకట్టుకుంటున్నాయి. అద్భుతమైన యాక్సెసిబిలిటీ ఫీచర్లను కలిగి ఉంది. ఆటోమేటెడ్ టికెట్ వెండింగ్,శుభ్రమైన ప్లాట్‌ఫారమ్‌లు ప్రయాణీకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.

సాంప్రదాయ రైల్వే స్టేషన్లకు భిన్నంగా..   

ఇక రాణి కమలపతి స్టేషన్ డిజైన్ సాధారణ రైల్వే స్టేషన్లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఆటోమొబైల్స్ కోసం షోరూమ్‌ లను కలిగి ఉంది. ఈ అదనపు సౌకర్యాలు దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలను హైలెట్ చేస్తున్నాయి.  రాణి కమలపతి స్టేషన్ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్, రాజధాని ఎక్స్‌ ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ ప్రెస్, దురంతో ఎక్స్‌ ప్రెస్ లాంటి ఫ్లాగ్‌ షిప్ రైళ్లకు ఆపరేటింగ్ పాయింట్ గా కొనసాగుతోంది.  విస్తృత రైల్వే నెట్‌వర్క్‌ తో పాటు స్టేషన్ లోని సర్వీసులు ప్రయాణీకులను ఆకట్టుకుంటున్నాయి.న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై CST లాంటి మేటి రైల్వే స్టేషన్లను తలదన్నేలా ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించడం విశేషం. అక్కడి కంటే ఈ రైల్వే స్టేషన్ లోనే సర్వీసులు ప్రయాణీకులను అలరిస్తున్నాయి.

Read Also: రైలు కిందకి దూరి పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. వెంటనే అతడు ఏం చేశాడంటే?

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×