E-Paper
Advertisement

Hydrogen train: సైలెంట్‌గా వస్తుంది.. దూసుకుపోతుంది.. ఇదే మన హైడ్రోజన్ రైలు ప్రత్యేకత

Hydrogen train: సైలెంట్‌గా వస్తుంది.. దూసుకుపోతుంది.. ఇదే మన హైడ్రోజన్ రైలు ప్రత్యేకత
Advertisement

Hydrogen train: ఇండియన్ రైల్వేస్‌ మరో ముందుడుగు వేసింది. హిస్టరీలో ఫస్ట్‌ టైమ్‌ హైడ్రోజన్‌తో నడిచే రైలును పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. నార్తన్ రైల్వేస్‌ ఈ ట్రైన్‌ను ఆపరేట్ చేయనుంది. హర్యానాలో దీనిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం జింద్, సోనీపత్ మధ్య పరుగులు తీయనుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు జర్మనీ, స్వీడన్, జపాన్, చైనాలో మాత్రమే హైడ్రోజన్‌తో నడిచే రైళ్లు ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన భారత్ కూడా చేరనుంది. కానీ మన హైడ్రోజన్‌ ట్రైన్ మాత్రం కాస్త స్పెషల్. ఎందుకంటే బ్రాడ్‌ గేజ్‌లో అత్యంత దూరం నడిచే హైడ్రోజన్ ట్రైన్‌ మాత్రం మనదే.

ఈ హైడ్రోజన్‌ రైలులో పది కోచ్‌లు ఉంటాయి. ఇందులో రెండు ఇంజిన్‌లు.. ఎనిమిది ప్యాసింజర్ కోచ్‌లు ఉంటాయి. వీటిని చెన్నై ఇంటిగ్రేటేడ్ కోచ్‌ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఈ ట్రైన్‌కి అవసరమైన హైడ్రోజన్‌ను ప్రొడ్యూస్ చేయడానికి జింద్‌లో హైడ్రోజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వాటర్‌ నుంచి హైడ్రోజన్‌ను సపరేట్ చేసి స్టోర్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ట్రైన్‌ ట్రయల్‌ రన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ అయ్యింది. టెక్నికల్ చెకింగ్స్ మాత్రం కొనసాగుతున్నాయి. ఈ ట్రైన్ ఆపరేషనల్ స్పీడ్ 110 కిలోమీటర్లుగా చెబుతున్నారు అధికారులు. కమర్షియల్ ఆపరేషన్స్, టికెట్ రేట్లు ఎలా ఉంటాయనేది మాత్రం ఇంకా ఫైనల్ కానట్టు తెలుస్తోంది.

Advertisement

ఈ కోచ్‌ల డిజైన్ కాస్త డిఫరేంట్‌గా ఉంటుంది. ఈ కోచ్‌లు మెట్రో కోచ్‌లను పోలి ఉంటాయి. రెండు వైపులా స్లైడింగ్‌ డోర్స్ ఉంటాయి. ఇక ఈ ట్రైన్ ఎలాంటి సౌండ్ చేయదు. ఇంకా ఫుల్ ఏసీ ఉంటుంది. 360 కేజీల హైడ్రోజన్‌తో 180 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ఎలక్ట్రిక్ ఇంజిన్స్‌తో కంపేర్ చేస్తే.. 10 రేట్లు అధికదూరంతో సమానం అంటున్నారు. రెండు వైపులా ఇంజిన్స్‌ ఉండటంతో యాక్సిలరేషన్ స్మూత్‌గా ఉంటుంది.. వేగంగా స్పీడ్‌ను అందుకుంటుందని చెబుతున్నారు.

ఇండియన్ రైల్వేస్ గ్రీన్‌ మొబిలిటి ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ హైడ్రోజన్ ట్రైన్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఈ రైలును రిపబ్లిక్ డే రోజు అఫిషియల్‌గా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఈ హైడ్రోజన్‌ రైలు పూర్తిగా పర్యావరణ హితం. ఇందులో నుంచి ఎలాంటి వ్యర్థాలు రావు. కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది. సో.. ఈ రైలు ఎలాంటి కాలుష్య కారకం కాదనే చెప్పాలి.

Advertisement

ALSO READ: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కడప DRC మీటింగ్‌లో ప్రకంపనలు

Related News

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

Big Stories

Advertisement
×