Railway Rules: భారతీయ రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల సౌకర్యార్థం, పారదర్శకతను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా టికెట్ల రిజర్వేషన్, రద్దు (Cancellation), బోర్డింగ్ పాయింట్ మార్పునకు సంబంధించి రైల్వే శాఖ సరికొత్త నిబంధనలను ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి 15వ తేదీ మధ్యలో దశలవారీగా అమలులోకి రానున్న ఈ మార్పులు, సామాన్య ప్రయాణికులకు మేలు చేకూర్చడంతో పాటు టికెట్ల బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్ట వేయనున్నాయి.
టికెట్ రద్దు నిబంధనల్లో మార్పులు..
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, దళారుల ఆగడాలను నియంత్రించడమే లక్ష్యంగా రిఫండ్ పాలసీని కఠినతరం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం, టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని బట్టి రిఫండ్ మొత్తంలో మార్పులు ఉంటాయి.
అయితే రైలు బయల్దేరడానికి 72 గంటల కంటే ముందు కన్ఫామ్ టికెట్ను రద్దు చేసుకుంటే పూర్తి రిఫండ్ ఇస్తారు. కేవలం రద్దు ఛార్జీలు మాత్రమే విధిస్తారు. 72 గంటల నుంచి 24 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే 75% వెనక్కి వస్తుంది. 24 గంటల నుంచి 8 గంటల మధ్య రద్దు చేసుకొంటు 50% మాత్రమే రీఫండ్ అవుతుంది. 8 గంటల కంటే తక్కువ100%ఎలాంటి రిఫండ్ లభించదు
దళారుల దందాకు ‘చెక్’
గతంలో రైలు బయల్దేరడానికి కొద్ది నిమిషాల ముందు కూడా టికెట్లు రద్దు చేసుకునే వెసులుబాటు ఉండేది. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది దళారులు పెద్ద ఎత్తున టికెట్లను బ్లాక్ చేసి, చివరి నిమిషంలో వాటిని రద్దు చేస్తూ రిఫండ్ పొందేవారు. దీనివల్ల అత్యవసరంగా ప్రయాణించాల్సిన సామాన్యులకు బెర్తులు దొరికేవి కావు. తాజా నిబంధన ప్రకారం 8 గంటల లోపు రద్దు చేస్తే పైసా కూడా తిరిగి రాదు కాబట్టి, దళారుల రిస్క్ పెరిగి టికెట్ల లభ్యత మెరుగుపడే అవకాశం ఉంది.
బోర్డింగ్ స్టేషన్ మార్పులో వెసులుబాటు
రద్దు నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ, బోర్డింగ్ స్టేషన్ మార్పు విషయంలో రైల్వే శాఖ ప్రయాణికులకు భారీ ఊరటనిచ్చింది. గతంలో చార్ట్ తయారైన తర్వాత బోర్డింగ్ పాయింట్ మార్చుకునే అవకాశం ఉండేది కాదు. కానీ కొత్త నిబంధన ప్రకారం, రైలు బయల్దేరడానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్ను ఆన్లైన్ లేదా కౌంటర్ ద్వారా మార్చుకోవచ్చు.
మెట్రో నగరాల ప్రయాణికులకు వరం
హైదరాబాద్ (సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ), ఢిల్లీ, ముంబై వంటి బహుళ రైల్వే స్టేషన్లు ఉన్న నగరాల్లో నివసించే వారికి ఈ నిర్ణయం ఎంతో కీలకం. ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఒక స్టేషన్లో రైలు ఎక్కడం సాధ్యం కాకపోతే, తర్వాతి స్టేషన్లో ఎక్కేలా సులభంగా మార్పులు చేసుకోవచ్చు. దీనివల్ల ప్రయాణికుల టికెట్ వృథా కాకుండా ఉంటుంది.
Also Read: రంగు రంగుల రైళ్లు.. ఒక్కో కలర్ వెనక ఒక్కో కథ!
ముగింపు, అమలు..
ఈ కొత్త సంస్కరణలు ఏప్రిల్ రెండో వారం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మరింత జాగ్రత్తగా రూపొందించుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ఆధునిక సాంకేతికతను జోడించి, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.