E-Paper
Advertisement

రైల్వే ఫుడ్‌ పై AI కన్ను.. ఇక అపరిశుభ్రతకు నో ఛాన్స్!

రైల్వే ఫుడ్‌ పై AI కన్ను.. ఇక అపరిశుభ్రతకు నో ఛాన్స్!

Train Food Surveillance With AI System: భారతీయ రైల్వేలో ప్రయాణికులకు అందించే ఆహారం నాణ్యత, పరిశుభ్రతను మరింత మెరుగుపరచేందుకు ఐఆర్‌సిటిసి (IRCTC) కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. రైళ్లలో సరఫరా చేసే భోజనం తయారీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఆధారిత వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వంటగదులను 24 గంటలూ నిశితంగా గమనిస్తూ పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయిస్తోంది.

బేస్ కిచెన్లలో ఏఐ సీసీ కెమెరాలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైళ్లకు ఆహారం సరఫరా చేసే 800కు పైగా బేస్ కిచెన్‌లలో సుమారు 2,400 ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు ఢిల్లీలోని ఐఆర్‌సిటిసి ప్రధాన కార్యాలయంలో ఉన్న కేంద్ర పర్యవేక్షణ సెంటర్ కు అనుసంధానించబడ్డాయి. అక్కడి నుంచి అధికారులు వంటగదుల్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని పర్యవేక్షిస్తున్నారు.

అపరిశుభ్రతను ఇట్టే పసిగట్టేస్తున్న ఏఐ కెమెరాలు

ఈ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే.. సాధారణంగా కంటికి కనిపించని చిన్నపాటి పరిశుభ్రత లోపాలను కూడా గుర్తిస్తుంది. ఆహార తయారీ సమయంలో హెయిర్‌ నెట్ ధరించకపోవడం, గ్లౌజులు ఉపయోగించకపోవడం, పరిశుభ్రత నిబంధనలు పాటించకపోవడం లాంటి అంశాలను ఏఐ వెంటనే గుర్తిస్తుంది. అంతేకాకుండా ఎలుకలు, ఈగలు, బొద్దింకలు లాంటి కీటకాలను ఇట్టే గుర్తించి అలర్ట్ చేస్తుంది.

9 రకాల పరిశుభ్రతా లోపాల గుర్తింపు

IRCTC స్మార్ట్ వ్యవస్థ మొత్తం తొమ్మిది రకాల పరిశుభ్రత లోపాలను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వంటగదిలో నేల శుభ్రత, ఫుడ్ మెయింటెనెన్స్ విధానం, సిబ్బంది భద్రతా పరికరాల వినియోగం లాంటి అంశాలపై నిరంతరం నిఘా ఉంచుతుంది. 7 నుంచి 8 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న చిన్న కీటకాన్ని కూడా గుర్తించే స్థాయిలో ఈ కెమెరాలు పని చేస్తున్నాయి.

ఆహార నాణ్యతలో ఏదైనా లోపం గుర్తించిన వెంటనే సంబంధిత కిచెన్ మేనేజర్‌ కు ఆటోమేటిక్ అలర్ట్ పంపబడుతుంది. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే అది పైస్థాయి అధికారుల దృష్టికి వెళ్తుంది. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యానికి అవకాశం లేకుండా వ్యవస్థ పనిచేస్తోంది.  దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ఏఐ పర్యవేక్షణ వ్యవస్థను ఐఆర్‌సిటిసి క్రమంగా విస్తరిస్తోంది. మరిన్ని వంటగదులను ఈ నెట్‌ వర్క్‌ లోకి తీసుకురావడంతో పాటు  పరిశుభ్రత తనిఖీలను కూడా అమలు చేయాలని భావిస్తోంది. ప్రయాణికులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఐఆర్‌సిటిసి చేపట్టిన ఈ విధానం అందరి ప్రశంసలు పొందుతోంది.

Read Also: తత్కాల్ టికెట్ వెంటనే కన్ఫర్మ్ కావాలా? IRCTCలో సింపుల్ గా ఈ సెట్టింగ్స్ చేయండి!

Related News

తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం IRCTC బెటరా? RailOne బెటరా?

తత్కాల్ టికెట్ వెంటనే కన్ఫర్మ్ కావాలా? IRCTCలో సింపుల్ గా ఈ సెట్టింగ్స్ చేయండి!

రైలు మీదకి ఫుడ్ ప్యాకెట్ విసిరిన ప్రయాణికుడు, అసిస్టెంట్ లోకో పైలట్‌ కు తీవ్ర గాయాలు!

భారీ శబ్దంతో చీలిపోయిన రైలు బోగి.. భయంతో ప్రయాణికుల పరుగులు!

‘లండన్ ఐ’ తరహాలో ‘అమరావతి ఐ’.. కృష్ణా తీరంలో కళ్లు చెదిరే జెయింట్ వీల్ నిర్మాణం!

ఎసీ లేకుండానే చల్లని రైలు ప్రయాణం.. మొట్ట మొదటి ఏసీ బోగిని ఎలా తయారు చేశారంటే?

443 అడుగుల ఎత్తులో లండన్ అందాలు.. యూకే వెళ్లే వాళ్లు అస్సలు మిస్సవ్వొద్దు!

Big Stories

×