E-Paper
Advertisement

Pawan Kalyan: ఎల్ నినో భయాలకు చెక్! పవన్ కళ్యాణ్ ముందస్తు వ్యూహం.. ఆ జిల్లాలకు పండగే!

Pawan Kalyan: ఎల్ నినో భయాలకు చెక్! పవన్ కళ్యాణ్ ముందస్తు వ్యూహం.. ఆ జిల్లాలకు పండగే!
Advertisement

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా, ప్రతి ఒక్కరికీ సురక్షితమైన నీటిని అందించేందుకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార కార్యక్రమాల పురోగతిపై ఆయన దృష్టి సారించారు.

మెగా వాటర్ గ్రిడ్ పనుల్లో వేగం

Advertisement

పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ప్రతిపాదనలో ఉన్న మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు ఆ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడంలో అత్యంత కీలకమైనవని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ రెండు జిల్లాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. ప్రాజెక్టులకు సంబంధించిన ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణ పనులు ఇప్పటికే 40 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన పనులను కూడా వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

పైప్‌లైన్ నిర్మాణ పురోగతి

Advertisement

రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ రెండు మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పూర్తయితే దాదాపు 16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత చేకూరుతుంది. ఇప్పటికే రెండు జిల్లాల పరిధిలో సుమారు 200 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణం పూర్తయింది. ఇందులో పల్నాడు వాటర్ గ్రిడ్ పరిధిలో 152 కిలోమీటర్లు, ప్రకాశం వాటర్ గ్రిడ్ పరిధిలో 53 కిలోమీటర్ల మేర నెట్‌వర్క్ పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు.

ముందస్తు చర్యలు, క్షేత్రస్థాయి పరిశీలన

ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని పవన్ కళ్యాణ్ అధికారులను కోరారు. ఆయా ప్రాంతాల్లో తక్షణమే ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పనుల్లో ఎలాంటి అలసత్వానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు. పనుల నాణ్యతను తానే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తానని చెప్పారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

Also Read:  ‘నీట్’ లీకేజీపై విరుచుకుపడ్డ విద్యార్థి లోకం.. జులై 24న విద్యాసంస్థల బంద్!

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×