Paddy Procurement: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంతో అదనంగా వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత సీజన్ లో రికార్డు స్ధాయికి మించి వరి దాన్యం తెలంగాణలో కొనుగోలు చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. రబీ సీజన్ కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను బియ్యం రూపంలో పెంచేందుకు ఆమోదం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read: 48 ఏళ్లుగా బస్సే లేని గ్రామం.. ఎట్టకేలకు ఊర్లోకి ఎర్రబస్సు.. ఎక్కడో చూసేయండి!
సవరించిన వరి కొనుగోలు అంచనా బియ్యం రూపంలో 43.00 లక్షల మెట్రిక్ టన్నులుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వాహనాల స్థాన నిర్ధారణ వ్యవస్థను 2026 సెప్టెంబర్ 30 లోపు పూర్తిగా అమలు చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ధేశించింది. పార్లమెంట్లో ఆహార & ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసారు. వడ్ల కొనుగోలు అంచనాను పెంచినందుకు పీయూష్ గోయల్కు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Hyderabad Flyover: పెట్రోల్, టైమ్ రెండూ ఆదా.. జీహెచ్ఎంసీ నుంచి అదిరిపోయే అప్డేట్!