E-Paper
Advertisement

పురుగులు అయిపోయాయ్.. ఇప్పుడేమో ‘అవి’.. వందే భారత్ ఫుడ్‌లో ఏంటీ చెత్త?

పురుగులు అయిపోయాయ్.. ఇప్పుడేమో ‘అవి’.. వందే భారత్ ఫుడ్‌లో ఏంటీ చెత్త?
Advertisement

Vande Bharat Food Controversy: ప్రీమియం రైలు వందే భారత్ స్లీపర్ రైలులో అందించిన భోజనం విషయంలో తాజాగా మరో వివాదం తలెత్తింది. ఓ ప్రయాణికుడు తనకు వడ్డించిన ఆహారంలో చిన్న మెటల్ ముక్క వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ప్రీమియం రైళ్లలో ఆహార భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

పప్పులో ఇనుమ ముక్క!

జేఎస్‌కే ట్రావెలాగ్ అనే పేరుతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఒక ట్రావెల్ వ్లాగర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆయన చెప్పిన  వివరాల ప్రకారం.. 27576 నంబర్ గల వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రాత్రి భోజనం చేస్తుండగా పప్పులో ఒక చిన్న మెటల్ ముక్క కనిపించిందట. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి ఆయన ఎక్స్ లో షేర్ చేశారు. అంతేకాదు, ప్రీమియం రైల్లో ఫుడ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. “నేను భోజనం చేసే సమయంలో నా పళ్ల మధ్యకి ఈ మెటల్ ముక్క వచ్చింది. నేను తీసి చూసి షాకయ్యాను. ఇలాంటి ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారు?” అని ప్రశ్నించారు. సిబ్బంది భోజనం మార్చి ఇస్తామని చెప్పినప్పటికీ, ఒకవేళ ఆరోగ్య సమస్యలు వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.

Advertisement

అంతేకాదు,  తన ఆరోపణ నిజమని నిరూపించేందుకు ఫోటోలు కూడా షేర్ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇతర ప్రయాణికులు కూడా ఈ విషయాన్ని గమనించారని చెప్పుకొచ్చారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చాలా మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫుడ్ విషయంలో ఇంత అజాగ్రత్తగా ఎలా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

వందే భారత్ రైళ్లు సాధారణంగా ఆధునిక సౌకర్యాలు, మెరుగైన సేవలు, క్వాలిటీ ఫుడ్ అందిస్తాయి. కానీ, రీసెంట్ గా వెలుగులోకి వస్తున్న పలు ఘటనలు ఆ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం రైళ్లలో కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటే, ఆహార నాణ్యతపై మరింత కఠినమైన తనిఖీలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

స్పందించిన ఐఆర్‌సిటిసి అధికారులు

అటు ఈఘటనపై ఐఆర్‌సిటిసి అధికారులు స్పందించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు వెల్లడించారు. “మీ ఫిర్యాదు మాకు అందింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నాము” అని ఎక్స్ వేదికగా వెలలడించారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలను తెలుసుకొని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  వందేభారత్ ఫుడ్ కు సంబంధించి గతంలో కూడా పలు ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ఆహారంలో పురుగులు వచ్చినట్లు ప్రయాణీకులు వెల్లడించారు. దీంతో రైల్వే క్యాటరింగ్ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఈ ఘటనతోనైనా రైలులో ఆహార భద్రతను మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉదంటున్నారు ప్రయాణీకులు.

Read Also:  ట్రైన్ ఫుడ్ తింటున్నారా? ఈ వీడియో చూసాక జీవితంలో ఆ ఆలోచన రాదు!

Related News

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

Big Stories

Advertisement
×