E-Paper
Advertisement

Shocking Video: ట్రైన్ ఫుడ్ తింటున్నారా? ఈ వీడియో చూసాక జీవితంలో ఆ ఆలోచన రాదు!

Shocking Video: ట్రైన్ ఫుడ్ తింటున్నారా? ఈ వీడియో చూసాక జీవితంలో ఆ ఆలోచన రాదు!
Advertisement

Shocking Pantry Car Video Goes Viral: రైల్వే ఫుడ్ మీద తరచుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఫుడ్ క్వాలిటీ మీద, శుభ్రత మీద ప్రయాణీకులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. సాధారణ రైళ్ల మాట అటు ఉంచితే, వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. రీసెంట్ గా భోజనంతో పాటు పెరుగులోనూ పురుగులు వచ్చిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై సీరియస్ అయిన రైల్వే, క్యాటరర్ కు రూ. 10 లక్షల జరిమానా విధించడంతో పాటు కాంట్రాక్ట్ ను రద్దు చేశారు.

వెలుగులోకి షాకింగ్ వీడియో

ఇక తాజాగా రైల్వే ఫుడ్ కు సంబంధించి మరో షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎర్నాకులం నుంచి పూణేకు వెళ్లే ఎక్స్‌ ప్రెస్ రైలులో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆ రైలులోని ప్యాంట్రీ కార్‌ కు సంబంధించిన  నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసి ప్రయాణికుల్లో ఆందోళన పెరిగింది. రైల్వే ఆహార భద్రతపై తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్యాంట్రీ కార్ లోపల ఎలుకల గుంపు

Advertisement

ఈ వీడియోను ఒక ప్రయాణికుడు షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ప్యాంట్రీ కార్ లోపల ఎలుకల గుంపు తిరుగుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఫుడ్ తయారు చేసే ప్రదేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండటం చూసి చాలా మంది షాక్‌కు గురయ్యారు. ప్రతిరోజూ వందలాది ప్రయాణికులకు అందించే భోజనం ఇలాంటి వాతావరణంలో తయారవుతుందా? అని నెటిజన్లు  సీరియస్ అవుతున్నారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఇది చిన్న విషయం కాదంటున్నారు. ఎలుకలు అనేక రకాల వ్యాధులకు కారణం అవుతాయని, వాటివల్ల ఫుడ్ ఈజీగా పాయిజన్ అవుతుందంటున్నారు. అలాంటి ఆహారం తినడం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు రావచ్చంటున్నారు.

రైల్వే క్యాటరింగ్ వ్యవస్థపై విమర్శలు

Advertisement

ఈ సంఘటనతో రైల్వే క్యాటరింగ్ వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిశుభ్రత ప్రమాణాలు సరైన విధంగా పాటిస్తున్నారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్యాంట్రీ కార్లలో క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయా? శానిటైజేషన్ సరిగా జరుగుతోందా? అని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది రైలులో ఆహారం ఆర్డర్ చేయాలంటేనే భయం వేస్తుందంటున్నారు. ఈ ఘటన ఒక హెచ్చరికగా భావించి..  రైల్వే అధికారులు వెంటనే స్పందించాలంటున్నారు.  ఇలాంటి సమస్యలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్ననారు. ప్యాంట్రీ కార్లలో కఠినమైన నియంత్రణలు అమలు చేయాలంటున్నారు. క్రమం తప్పకుండా తనిఖీల చేయాలంటున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: రైలు సీటు దగ్గరికే ఫుడ్ డెలివరీ.. ixigo, Swiggy కొత్త సర్వీస్ షురూ!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×