E-Paper
Advertisement

ఎయిర్‌పోర్టుకు ముందుగా వచ్చినా.. 120 మంది విమానం మిస్సయ్యారు, అసలేం జరిగింది?

ఎయిర్‌పోర్టుకు ముందుగా వచ్చినా.. 120 మంది విమానం మిస్సయ్యారు, అసలేం జరిగింది?

Milan Linate Airport: యూరోపియన్ యూనియన్ తన కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన కొద్దిరోజులకు విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితంగా 120 మంది ప్రయాణికులకు విమానం మిస్ అయింది. అసలేం జరిగింది? ఎలాంటి నిబంధనలు యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

ఎయిర్‌పోర్టుకు ముందుగా వచ్చినా ప్రయాణికులు ఇబ్బందులు

యూరోపియన్ యూనియన్ ఇటీవల విమాన ప్రయాణికులకు బోర్డింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఆ నిర్ణయం ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కొత్త నిబంధనల వల్ల బోర్డింగ్ సమయంలో 120 మందికి పైగా ప్రయాణికులకు తమ విమానాలను మిస్ అయ్యారు. ఇటీవల యూరప్‌లో బోర్డర్ కంట్రోల్ సిస్టమ్ అమల్లోకి తెచ్చింది.

ఈ పద్దతి వల్ల ప్రయాణికులు పాస్‌పోర్టు స్టాంపింగ్‌కు బదులు బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయాల్సి ఉంది. ఎయిర్ పోర్టుకు ముందుగా వచ్చినా చెకింగ్ ఆలస్యమైంది. ఫలితంగా 120 మంది ప్రయాణికులు విమానం ఎక్కలేకపోయారు. మిలాన్ నుంచి మాంచెస్టర్‌కు వెళ్లేందుకు 156 మంది ట్రావెలర్లు తమ టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. ప్రయాణానికి కొన్ని గంటల ముందు వారంతా విమానాశ్రయానికి చేరుకున్నారు.

తనిఖీల వల్ల  120 మందికి విమానం మిస్సయ్యింది, అసలేం జరిగింది?

కేవలం చెకింగ్‌కు నాలుగైదు గంటల సమయం పట్టింది. ఫలితంగా వారంతా బోర్డింగ్ గేట్‌కు చేరుకోలేదు. కొత్త నిబంధనల వల్ల 156 మంది ప్రయాణికులకు కేవలం 34 మంది పాస్‌పోర్టుల చెకింగ్ పూర్తయింది. 120 మంది చెకింగ్ పూర్తి కాలేదు. కొత్త పద్ధతి వల్ల విమానం మిస్ కావడంతోపాటు గంటల కొద్దీ లైనులో నిలబడటం వల్ల కొంతమంది అస్వస్థతకు గురయ్యారు.

చెకింగ్ కారణంగా ప్రయాణికుల కోసం విమానాన్ని కొంత సమయం ఆపారు. అయినప్పటికీ 120 మందికి ఇబ్బంది తప్పలేదు. సరిహద్దు భద్రత నేపథ్యంలో యూరోపియన్ దేశాలు కొత్తగా ఎంట్రీ/ఎగ్జిట్ పద్దతిని తీసుకువచ్చాయి. బయో మెట్రిక్ రిజిస్ట్రేషన్, డేటా బేస్ చెకింగ్ కారణంగా విమానాన్ని ప్రయాణికులు అందుకోలేకపోయారని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

ALSO READ: పొరపాటున ఆ గ్లాస్ పగిలితే అంతే.. సముద్ర గర్భంలో అత్యంత ప్రమాదకరమైన హోటల్స్!

అయితే రద్దీగా ఉండే సమయాల్లో ప్రక్రియకు ఎక్కువ సమయం తీసుకోవచ్చన్నారు. బాధితుల్లో ఒకరు మాంచెస్టర్‌కు చెందిన ఓ ఫ్యామిలీ తమ అనుభవాన్ని అంతర్జాతీయ మీడియాతో పంచుకుంది. విమానయాన సంస్థ మార్గదర్శకాలను అనుసరించి నిర్ణీత సమయానికి మూడు గంటల ముందు తాము చేరుకున్నప్పటికీ విమానం ఎక్కలేకపోయామని వివరించింది.

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×