E-Paper
Advertisement

ట్రైన్‌ లో కూలరేసుకుని దర్జాగా పడుకున్న ప్రయాణికుడు.. నెట్టింట వీడియో వైరల్!

ట్రైన్‌ లో కూలరేసుకుని దర్జాగా పడుకున్న ప్రయాణికుడు.. నెట్టింట వీడియో వైరల్!
Advertisement

Indian Railway Viaral Video: ఎండలు రోజు రోజుకూ పెరుగుతున్న వేళ ప్రజలు చల్లదనం కోసం కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. అందులో భాగంగానే బీహార్‌ లో ఓ ప్రయాణికుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. సాధారణంగా ట్రైన్‌ లో వెళ్లే ప్రయాణికులు బ్యాగులు, సూట్‌ కేసులు, చిన్న ఫ్యాన్లు తీసుకెళ్తుంటారు. కానీ, ఓ ప్రయాణికుడు ఏకంగా  చిన్న ఎయిర్ కూలర్‌ ను ట్రైన్ లో పెట్టుకుని ప్రయాణిండం అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంతకీ వైరల్ వీడియోలో ఏముందంటే?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో సదరు ప్రయాణికుడు ట్రైన్‌ లోని తన సీటు దగ్గర కూలర్‌ ను పెట్టుకుని హాయిగా పడుకున్నాడు. కూలర్‌ లో నీళ్లు పోసి, పవర్ కనెక్షన్ ఇచ్చి ప్రయాణించాడు.  ట్రైన్‌ లోని ఇతర ప్రయాణికులు అతడిని చూసి ఆశ్చర్యపోయారు. రైల్లోని కొందరు ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ను తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది.

క్రేజీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు

Advertisement

ఈ వీడియో చూసిన నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. ఈ ఐడియా అద్భుతంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అటు ఎండల నుంచి తప్పించుకోవడానికి క్రేజీ ఆలోచన అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. మరికొందరు ఆయన చేసిన పనిని తప్పుబడుతున్నారు. ట్రైన్‌ లో ఇలా కూలర్ వాడటం ప్రమాదకరం కావచ్చంటున్నారు. రైల్వే నిబంధనలకు విరుద్ధం ఇలా చేయడం మంచిది కాదని మరో వ్యక్తి కామెంట్ చేశారు.   ఎలక్ట్రిక్ పరికరాలను ట్రైన్‌ లో అనుమతి లేకుండా ఉపయోగించడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.

రైళ్లలో ఎలక్ట్రిక్ వస్తువులను తీసుకెళ్లొచ్చా?    

రైల్వేల్లో సాధారణంగా భారీ ఎలక్ట్రిక్ పరికరాలను తీసుకెళ్లడంపై కొన్ని రూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా విద్యుత్  వినియోగించే వస్తువులు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. కానీ, ఈ ప్రయాణికుడు ఏకంగా  కూలర్‌ను ఎలా తీసుకెళ్లాడు? అధికారుల అనుమతి ఉందా? అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఘటనపై రైల్వే అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఫేస్‌ బుక్, ఇన్‌ స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్‌ లలో వైరల్ అవుతోంది.  లక్షలాది మంది ఈ వీడియోను చూసి క్రేజీగా రియాక్ట్ అయ్యారు. మొత్తంగా ఎండలు మండుతున్న వేళ  ప్రయాణికుడు చేసిన ఈ పని ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌ గా మారింది.

Advertisement

Read Also: ట్రైన్ టాయిలెట్‌ లో పడిపోయిన గోల్డ్ రింగ్.. రైల్వే సిబ్బంది ఏం చేశారంటే?

Related News

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

Big Stories

Advertisement
×