SCR Golden Diagonal Corridor: సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) హైదరాబాద్-విజయవాడ మార్గంలో రైలు స్పీడ్ను పెంచేందుకు సరికొత్త ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే ఈ పెంపునకు సంబంధించి కొత్త ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. ఈ ప్లాన్ ప్రకారం.. గోల్డెన్ డయాగనల్ (GD) కారిడార్ గా అప్ గ్రేడ్ చేయాలని భావిస్తుంది. ఈ అప్ గ్రేడ్ తర్వాత రైళ్లను 160 కిమీ/గం వేగంతో నడపాలని నిర్ణయించింది. ఇది సౌత్ ఇండియాలో తొలి సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్ గా గుర్తింపు పొందనుంది.
⦿ ప్రస్తుత ట్రావెల్ టైమ్: హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లడానికి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు 4 నుంచి 5 గంటల సమయం తీసుకుంటున్నాయి. వందే భారత్, దురంతో లాంటి ప్రీమియం రైళ్లు కూడా సుమారు 4 గంటలు తీసుకుంటున్నాయి.
⦿ ప్రతిపాదిత ట్రావెల్ టైమ్: అప్గ్రేడ్ తర్వాత.. సుమారు 350 కి.మీ ఉన్న ఈ ప్రయాణం కేవలం 3 గంటల లోపు పూర్తవుతుంది. ఇది ఎయిర్ ట్రావెల్ సమానంగా ఉండబోతోంది.
⦿ స్పీడ్ అప్గ్రేడ్: ప్రస్తుతం 130 కిమీ/గం వరకు ఉన్న స్పీడ్ను 160 కిమీ/గం కు పెంచుతారు. ఇది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ (GQ), ఇతర హై-డెన్సిటీ మార్గాల్లో భాగం కానుంది.
⦿ కవర్ అయ్యే సెక్షన్లు: సికింద్రాబాద్-కాజీపేట్, కాజీపేట్-విజయవాడ, దువ్వాడ-విజయవాడ, విజయవాడ-గూడూరు లాంటి కీలక సెక్షన్లు. ఈ సెక్షన్లలో ఇప్పటికే వందే భారత్, రాజధాని, దురంతో లాంటి ప్రీమియం రైళ్లు నడుస్తున్నాయి.
హైదరాబాద్- విజయవాడ మార్గాన్ని గోల్డెన్ డయాగనల్ (GD) కారిడార్ గా అప్ గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కేంద్రానికి పంపారు. ఆమోదం కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఆమోదం వచ్చిన తర్వాత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ను 2 సంవత్సరాలలోపు పూర్తి చేస్తారు. SCR ఇప్పటికే 2022-23లో పలు మార్గాలను 130 కిమీ/గం కు అప్గ్రేడ్ చేసింది. మొత్తం 6,560 కి.మీ. నెట్ వర్క్ లో 1,834 కి.మీ. ఇప్పుడు 130 కిమీ/గం కు అనుకూలంగా మారింది. ఈ కొత్త ప్లాన్లో సుమారు 2,500 కి.మీ. మార్గాలను 160 కిమీ/గం కు అప్గ్రేడ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది.
⦿ వేగవంతమైన ప్రయాణం: గోల్డెన్ డయాగనల్ (GD) కారిడార్ తో 350 కి.మీ. దూరం ఉన్న ఈ మార్గంలో రైలు ప్రయాణం ఎయిర్ ట్రావెల్తో సమానంగా మారుతుంది, ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ సమయాలను పరిగణలోకి తీసుకుంటే రైలు మరింత సౌకర్యవంతం కానుంది.
⦿మరిన్ని రైళ్లు: హై డెన్సిటీ మార్గాల్లో మరిన్ని రైళ్లను నడిపే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది.
⦿ సౌత్ ఇండియాలో ఫస్ట్ రూట్: ఇప్పటి వరకు 160 కిమీ స్పీడ్ తో వెళ్లే మార్గాలు నార్త్ ఇండియాలో ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-మీరట్ మధ్య మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్- విజయవాడ మార్గంలో రానుంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీని బూస్ట్ చేస్తుంది.
ఇటీవల మరో సెమీ హై-స్పీడ్ రైల్ కారిడార్ (హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం)కు ఇన్ ప్రిన్సిపల్ ఆమోదం వచ్చింది. ఇది సూర్యాపేట్ మీదుగా నడుస్తుంది, స్పీడ్ గంటకు 220 కిమీ ఉంటుంది. హైదరాబాద్-విశాఖపట్నం (సుమారు 700 కి.మీ.) మధ్య ప్రయాణం కేవలం 4.5 గంటల్లో పూర్తవుతుంది. హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణం సుమారు 2.5 గంటల్లో పూర్తి కానుంది. ఈ రెండు ప్లాన్లు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రైల్ కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తాయి. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, రైలు ప్రయాణం మరింత వేగవంతం, సౌకర్యవంతం అవుతుంది.
Read Also: ఖర్దుంగ్ లా To సేలా పాస్.. ఈ రోడ్ల మీద ప్రయాణం అంటే ప్రాణం మీద ఆశ వదిలేయాల్సిందే!