Sankranti Special Trains: తెలుగు ప్రజలు అట్టహాసంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సొంతూళ్లకు చేరుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు గ్రామాలకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే సంక్రాంతి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈమేరకు 57 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వాటికి సంబంధించిన వివరాలను విడుదల చేసింది.
సౌత్ సెంట్రల్ రైల్వే జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి పండుగ కోసం వివిధ ప్రాంతాలకు 57 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవన్నీ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి. ఇంతకీ ఈ రైళ్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
⦿ కాకినాడ టౌన్-వికారాబాద్
⦿ వికారాబాద్-కాకినాడ టౌన్
⦿ కాకినాడ టౌన్-సికింద్రాబాద్
⦿ సికింద్రాబాద్-కాకినాడ టౌన్
⦿ కాకినాడ టౌన్-లింగంపల్లి/ వికారాబాద్
⦿ వికారాబాద్/ లింగంపల్లి-కాకినాడ టౌన్
⦿ తిరుపతి-వికారాబాద్
⦿ వికారాబాద్-నరసపూర్
⦿ నరసపూర్-వికారాబాద్
⦿ నరసపూర్-సికింద్రాబాద్
⦿ సికింద్రాబాద్-నరసపూర్
⦿ నరసపూర్-లింగంపల్లి/ వికారాబాద్
⦿ వికారాబాద్/ లింగంపల్లి-నరసాపూర్
⦿ సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్
⦿ శ్రీకాకుళం రోడ్ – సికింద్రాబాద్
⦿ వికారాబాద్ – శ్రీకాకుళం రోడ్డు
ప్రస్తుతానికి ఈ రైళ్లను ప్రకటించినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. రద్దీకి అనుగుణంగా అవసరం అయితే, మరిన్ని రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది.
🚉✨️SCR to run additional Sankranti Special Trains between various Destinations📢@RailMinIndia@SCRailwayIndia #sankrantispecialtrains #specialtrains#yatrisewa pic.twitter.com/YGNw6EFyTJ
— South Central Railway (@SCRailwayIndia) December 16, 2025
Read Also: వందే భారత్ రైళ్లలో లోకల్ ఫుడ్స్, ఇక లొట్టలేసుకుంటూ తినేయొచ్చు!
అటు అజ్మీర్ 814వ వార్షిక ఉర్సు సందర్భంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు, డిసెంబర్ 23న హైదరాబాద్ నుంచి అజ్మీర్కు, డిసెంబర్ 27న అజ్మీర్ నుంచి హైదరాబాద్ కు నడుస్తాయని తెలిపారు. ప్రయాణీకులు ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకోవాలని సూచించారు.
Read Also: డ్రైవర్ లెస్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ఇక సెకెన్ కూడా లేటవదండోయ్!