Indian Railways Summer Special Trains: వేసవి సెలవులు దగ్గర పడుతున్న నేపథ్యంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏప్రిల్, మే నెలల్లో ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ స్పెషల్ ట్రైన్లు నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా విశాఖపట్నం, భువనేశ్వర్ లాంటి నగరాలకు వెళ్లే ప్యాసింజర్స్ కు ఈ రైళ్లు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నాయి.
⦿విశాఖపట్నం–శాలిమార్ మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైలు (08508/08507).. ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు ప్రతి మంగళవారం ఉదయం 11:20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 3:00 గంటలకు శాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఏప్రిల్ 8 నుంచి జూలై 1 వరకు ప్రతి బుధవారం ఉదయం 5:00 గంటలకు శాలిమార్ నుంచి బయలుదేరి, అదే రోజు రాత్రి 8:50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.
⦿ భువనేశ్వర్–యశ్వంత్ పూర్ మధ్య కూడా వీక్లీ స్పెషల్ రైలు నడుస్తుంది. ఇది ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రతి శనివారం సాయంత్రం 7:15 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి, అర్ధరాత్రి 12:15 గంటలకు యశ్వంత్పూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు ప్రతి సోమవారం ఉదయం 4:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6:00 గంటలకు భువనేశ్వర్ చేరుతుంది. మొత్తం ఈ సర్వీసులు 13 ట్రిప్పులను అందిస్తుంది.
⦿ సంబల్ పూర్–ఈరోడ్ మధ్య నడిచే ప్రత్యేక రైలు (08311/08312) కూడా అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఏప్రిల్ 1 నుంచి మే 27 వరకు ప్రతి బుధవారం ఉదయం 11:35 గంటలకు సంబల్పూర్ నుంచి బయలుదేరి, గురువారం రాత్రి 10:50 గంటలకు ఈరోడ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు బయలుదేరి, శనివారం రాత్రి 11:15 గంటలకు సంబల్పూర్ చేరుతుంది. మొత్తం తొమ్మిది ట్రిప్పులు వేస్తుంది.
⦿ యశ్వంత్ పూర్–కతిహార్ మధ్య కూడా ఒక ప్రత్యేక రైలు (06571) నడుస్తుంది. ఇది ఏప్రిల్ 7 నుంచి జూలై 14 వరకు ప్రతి మంగళవారం ఉదయం 7:00 గంటలకు యశ్వంత్పూర్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5:00 గంటలకు విజయనగరం చేరుతుంది. అక్కడి నుంచి కతిహార్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఏప్రిల్ 10 నుంచి జూలై 17 వరకు ప్రతి శుక్రవారం బయలుదేరి, ఆదివారం ఉదయం యశ్వంత్పూర్ చేరుతుంది. ఈ రైలు మొత్తం 15 ట్రిప్పులు నడుస్తుంది.
ఈ ప్రత్యేక రైళ్లు వేసవిలో పెరిగే రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ముందుగానే షెడ్యూల్ తెలుసుకుని టికెట్లు బుక్ చేసుకుంటే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు సూచించారు. ముఖ్యంగా విశాఖపట్నం, భువనేశ్వర్ ప్రాంతాల నుంచి ప్రయాణించే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Read Also: ఆ స్పెషల్ రైళ్లు ఇక రెగ్యులర్ సర్వీసులు.. కాకినాడ ప్రజలకు రైల్వే గుడ్ న్యూస్!