E-Paper
Advertisement

వైజాగ్ నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లు, ఎప్పటి నుంచి నడుస్తాయంటే?

వైజాగ్ నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లు, ఎప్పటి నుంచి నడుస్తాయంటే?
Advertisement

Indian Railways  Summer Special Trains: వేసవి సెలవులు దగ్గర పడుతున్న నేపథ్యంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏప్రిల్, మే నెలల్లో ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ స్పెషల్ ట్రైన్లు నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా విశాఖపట్నం, భువనేశ్వర్ లాంటి నగరాలకు వెళ్లే ప్యాసింజర్స్ కు ఈ రైళ్లు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నాయి.

⦿విశాఖపట్నం–శాలిమార్ మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైలు (08508/08507)..  ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు ప్రతి మంగళవారం ఉదయం 11:20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 3:00 గంటలకు శాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఏప్రిల్ 8 నుంచి జూలై 1 వరకు ప్రతి బుధవారం ఉదయం 5:00 గంటలకు శాలిమార్ నుంచి బయలుదేరి, అదే రోజు రాత్రి 8:50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.

Advertisement

⦿ భువనేశ్వర్–యశ్వంత్‌ పూర్ మధ్య కూడా వీక్లీ స్పెషల్ రైలు నడుస్తుంది. ఇది ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రతి శనివారం సాయంత్రం 7:15 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి, అర్ధరాత్రి 12:15 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు ప్రతి సోమవారం ఉదయం 4:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6:00 గంటలకు భువనేశ్వర్ చేరుతుంది. మొత్తం ఈ సర్వీసులు 13 ట్రిప్పులను అందిస్తుంది.

⦿ సంబల్‌ పూర్–ఈరోడ్ మధ్య నడిచే ప్రత్యేక రైలు (08311/08312) కూడా అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఏప్రిల్ 1 నుంచి మే 27 వరకు ప్రతి బుధవారం ఉదయం 11:35 గంటలకు సంబల్‌పూర్ నుంచి బయలుదేరి, గురువారం రాత్రి 10:50 గంటలకు ఈరోడ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు బయలుదేరి, శనివారం రాత్రి 11:15 గంటలకు సంబల్‌పూర్ చేరుతుంది. మొత్తం తొమ్మిది ట్రిప్పులు వేస్తుంది.

Advertisement

⦿ యశ్వంత్‌ పూర్–కతిహార్ మధ్య కూడా ఒక ప్రత్యేక రైలు (06571) నడుస్తుంది. ఇది ఏప్రిల్ 7 నుంచి జూలై 14 వరకు ప్రతి మంగళవారం ఉదయం 7:00 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5:00 గంటలకు విజయనగరం చేరుతుంది. అక్కడి నుంచి కతిహార్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఏప్రిల్ 10 నుంచి జూలై 17 వరకు ప్రతి శుక్రవారం బయలుదేరి, ఆదివారం ఉదయం యశ్వంత్‌పూర్ చేరుతుంది. ఈ రైలు మొత్తం 15 ట్రిప్పులు నడుస్తుంది.

సమ్మర్ ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా..

ఈ ప్రత్యేక రైళ్లు వేసవిలో పెరిగే రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ముందుగానే షెడ్యూల్ తెలుసుకుని టికెట్లు బుక్ చేసుకుంటే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు సూచించారు. ముఖ్యంగా విశాఖపట్నం, భువనేశ్వర్ ప్రాంతాల నుంచి ప్రయాణించే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Read Also: ఆ స్పెషల్ రైళ్లు ఇక రెగ్యులర్ సర్వీసులు.. కాకినాడ ప్రజలకు రైల్వే గుడ్ న్యూస్!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×