E-Paper
Advertisement

Railways Fare System: రైలు టికెట్ ధరలను ఇలా నిర్ణయిస్తారా? వామ్మో పెద్ద కథే!

Railways Fare System: రైలు టికెట్ ధరలను ఇలా నిర్ణయిస్తారా? వామ్మో పెద్ద కథే!
Advertisement

భారతీయ రైల్వే టిక్కెట్ ధరలు తరగతి, ప్రయాణ దూరం, రైలు రకం ఆధారంగా మారుతూ ఉంటాయి. వీటిలో మెయిల్ ఎక్స్‌ ప్రెస్, రాజధాని, వందే భారత్ వంటి ప్రీమియం సర్వీసులు కూడా ఉన్నాయి. డిసెంబర్ 2025లో ఛార్జీల సర్దుబాటుల తర్వాత వివిధ కేటగిరీలలో టిక్కెట్ ధరలలో స్వల్ప సవరణలు జరిగాయి. 500 నుంచి 1,000 కిలోమీటర్ల మధ్య ప్రయాణాలకు, ప్రాథమిక సీటింగ్ ఏర్పాట్ల కోసం ఛార్జీ రూ. 150 నుండి ప్రారంభం కాగా, విలాసవంతమైన వసతుల కోసం ఇది రూ. 5,000 పైగా ఉంటుంది.

తరగతుల వారీగా ఛార్జీల వివరాలు

భారతీయ రైల్వే ఛార్జీలు అనేది ఆయా తరగతులకు అనుగుణంగా సౌకర్యాలు అందిస్తాయి. సెకండ్ సిట్టింగ్ (2S) తరగతి ఛార్జీలు రూ. 150 నుంచి 400 వరకు ఉంటాయి. ఇందులో రిజర్వేషన్ లేని, నాన్ ఏసీ బెంచ్ సీటింగ్ ఉంటుంది. ఇది  రద్దీగా ఉంటుంది. స్లీపర్ (SL) తరగతి ఛార్జీలు రూ. 400 నుంచి 800 వరకు ఉంటాయి. ఇందులో ఒక్కో బేలో ఆరుగురు ప్రయాణికులకు వసతి కల్పించే నాన్ ఏసీ 3 టైర్ బంక్‌లు ఉంటాయి. రాత్రిపూట ప్రయాణానికి సరసమైన ఎంపిక. ఏసీ 3 టైర్ (3A) తరగతి ధర రూ. 800 నుంచి 1,500 మధ్య ఉంటుంది. ఇందులో 72 బంక్ స్పేస్‌ లు, భోజన సర్వీసులు, గోప్యత కోసం కర్టెన్‌లతో కూడిన ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఏసీ 2 టైర్ (2A) తరగతి ధర రూ. 1,200 నుంచి 2,200 మధ్య ఉంటుంది. ఇందులో సైడ్ సీట్లతో సహా 46 బెర్త్‌ లతో ప్రయాణికులు మరింత స్థలాన్ని పొందుతారు. రూ. 700 నుంచి 1,400 వరకు ధర ఉండే ఏసీ చైర్ కార్ (CC), పగటిపూట ప్రయాణాలకు అనువైన, వెనక్కి వాలే ఏసీ సీట్లను అందిస్తుంది. అత్యంత సౌకర్యాన్ని కోరుకునే వారి కోసం, రూ. 3,000 నుంచి 5,000 పైగా ఛార్జీలు ఉండే ఏసీ ఫస్ట్ క్లాస్ (1A) కోచ్ లు ఉంటాయి. నలుగురు ప్రయాణీకుల వరకు వసతి కల్పించే ఏసీ కూపే క్యాబిన్‌లు ఉంటాయి. చివరగా, రూ. 2,000 నుంచి4,000 వరకు ఉండే ఎగ్జిక్యూటివ్ క్లాస్ (EC), వందే భారత్ వంటి రైళ్లలో బిజినెస్ క్లాస్ ప్రయాణీకుల కోసం రూపొందించిన ప్రీమియం ఏసీ సీటింగ్‌ను అందిస్తుంది.

టికెట్ ధరలను ప్రభావితం చేసే అంశాలు

Advertisement

భారతీయ రైల్వే ఛార్జీలు అనేక అంశాల ఆధారంగా మారుతూ ఉంటాయి. ప్రధానంగా, ప్రయాణించిన దూరం టికెట్ ధరను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. రైలు రకం మరో కీలకమైన అంశం.   ఎందుకంటే.. రాజధాని, వందే భారత్ లాంటి ప్రీమియం సర్వీసులకు సాధారణంగా అధిక ఛార్జీలు ఉంటాయి. డిమాండ్‌కు  అనుగుణంగా డైనమిక్ ప్రైసింగ్ విధానాలు, రద్దీ సమయాల్లో ధరలను పెంచే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, సూపర్‌ ఫాస్ట్ ఫీజులు, క్యాటరింగ్ ఖర్చులతో సహా అదనపు ఛార్జీలు వర్తిస్తాయి.

Read Also: నవరాత్రి వేళ వైష్ణోదేవి దర్శనం.. IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీ!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×