E-Paper
Advertisement

IRCTC Tour Package: నవరాత్రి వేళ వైష్ణోదేవి దర్శనం.. IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీ!

IRCTC Tour Package: నవరాత్రి వేళ వైష్ణోదేవి దర్శనం.. IRCTC  అదిరిపోయే టూర్ ప్యాకేజీ!
Advertisement

IRCTC Vaishno Devi Tour Package: నవరాత్రి సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. తొమ్మిది రోజులలో అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అందుకే ఈ రోజులలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక దేశంలోని కొన్ని అమ్మవారి ఆలయాలు బాగా ప్రసిద్ధి చెందాయి. విజయవాడ కనకదుర్గతో పాటు జమ్మూకాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయాల్లో నవరాత్రి వేడుకలు కన్నుల పండువగా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో IRCTC తాజాగా మరో క్రేజీ టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది. వైష్ణో దేవి టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకవేళ మీరు చాలా కాలంగా అమ్మవారి ఆలయాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. జమ్మూ కాశ్మీర్‌ లోని పవిత్ర వైష్ణో దేవి ఆలయ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్యాకేజీ వివరాల గురించి..

IRCTC యాత్రికుల కోసం మాతా వైష్ణోదేవి ఎక్స్ ఢిల్లీ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వైష్ణో దేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించేలా చేస్తుంది. ఈ ప్యాకేజీ కోడ్ NDR01. ఈ టూర్ 3 రాత్రులు, 4 రోజులు ఉంటాయి. ఈ ప్రయాణంలో రెండు రాత్రులు రైలులో, ఒక రాత్రి కత్రాలోని హోటల్‌లో బసతో పాటు, రవాణా, వసతి,  దర్శనం కోసం పూర్తి ఏర్పాట్లు ఉంటాయి. ఈ ప్రయాణం రాత్రి 8:40 గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మీరు 12425 నంబర్ రైలులో జమ్మూకు బయలుదేరి, ఉదయం 5 గంటల ప్రాంతంలో కత్రా స్టేషన్‌కు చేరుకుంటారు.

జమ్మూలోని ప్రధాన దేవాలయాల దర్శనం

Advertisement

ఈ టూర్ ప్యాకేజీ మిమ్మల్ని మాతా వైష్ణో దేవిని సందర్శించడానికే కాకుండా, ఇతర ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని కూడా అందిస్తుంది. వీటిలో కంద్ కండోలి ఆలయం, రఘునాథ్‌ జీ ఆలయం, బాగ్ ఎ బహు గార్డెన్ లాంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల పర్యటన తర్వాత, మధ్యాహ్నం మిమ్మల్ని జమ్మూకు తీసుకువెళతారు. ఈ ప్యాకేజీ     మార్చి 24న ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది.

Read Also: ఇక మరింత వేగంగా ఆన్‌ లైన్ టికెట్ బుకింగ్, గుడ్ న్యూస్ చెప్పిన IRCTC!

సరసమైన టూర్ ప్యాకేజీ

Advertisement

ఈ ప్యాకేజీతో తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంది. 3AC క్లాస్‌ లో ఈ ట్రిప్‌ కు సింగిల్ షేరింగ్ కోసం రూ. 10,770 ఖర్చవుతుంది. డబుల్, ట్రిపుల్ షేరింగ్ ఛార్జీలు వరుసగా ఒక్కొక్కరికి రూ.8,100, రూ. 6,990గా ఉంటాయి. మీరు ఈ ప్యాకేజీని IRCTC అధికారిక వెబ్‌ సైట్ లేదంటే మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ గురించి మరింత సమాచారం కోసం, ఈ నెంబర్స్ కు కాల్ చేయాలని (9717648888, 8287930712, మరియు 8287930620) IRCTC సూచించింది.

Read Also: అప్పర్ బెర్త్ vs లోయర్ బెర్త్.. లాంగ్ ట్రైన్ జర్నీస్ లో పడుకోవడానికి ఏది బెస్ట్?

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×