భారత్ లో అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైళ్లుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 150కి పైగా రైళ్లు ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. ప్రయాణీకులకు ప్రపంచ స్తాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. రీసెంట్ గా సుదూర ప్రయాణాలకు అనుకూలంగా వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఈ రైళ్ల తయారీని మరింత వేగంగా కొనసాగిస్తుంది. దేశ వ్యాప్తంగా మరిన్ని వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడంపై ఫోకస్ పెట్టింది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ తయారీకి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో భారతీయ సెమీ హైస్పీడ్ రైళ్లను ఎలా తయారు చేస్తారో క్లియర్ కట్ గా చూపిస్తుంది. ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ కరణ్ కపూర్(@karannzzz) ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. చెన్నైలోని రైల్వే కోచ్ తయారీ విధానాన్ని చూపించారు.
ఈ వీడియోలోని పలు దృశ్యాలు రైలు కోచ్ ల తయారీ ప్రక్రియకు సంబంధించిన పలు దశలను చూపుతాయి. దాదాపు పూర్తయిన రైల్వే కోచ్ ను పెద్ద వర్క్ షాప్ లోపల ట్రాక్లపై ఉంచినట్లు కనిపిస్తుంది. కోచ్ కింద, కార్మికుడు నేలపై కూర్చుని, యాంత్రిక భాగాలు, ఫిట్టింగ్ లపై జాగ్రత్తగా పని చేస్తున్నట్లు కనిపిస్తుంది. కోచ్ సర్వీసుకు సిద్ధంగా ఉండటానికి ముందు జరిగే కచ్చితమైన సాంకేతిక పనిని హైలైట్ చేశారు.
ఇక ఈ వీడియోలోని క్లిప్ లోని మరొక భాగం నిర్మాణంలో ఉన్న కోచ్ లోపలి భాగాన్ని చూపిస్తుంది. లోపలి భాగం లోహ నిర్మాణంగా కనిపిస్తుంది. ఫ్లోరింగ్, సీటింగ్, ఇంటీరియర్లను ఇన్ స్టాల్ చేసే ముందు క్యారేజ్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఫ్లోరింగ్ కోసం ఫ్రేమ్ వర్క్, ఇతర భాగాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇందులో అసెంబుల్డ్ ప్రారంభ దశలను చూపిస్తున్నాయి. ఈ స్పెషల్ షాట్ లో కోచ్ వెనుక భాగం పెద్ద ట్రాక్ లపై ఉంచినట్లు కనిపిస్తుంది. కెమెరా యూనిట్ గుండా కదులుతున్నప్పుడు, రైలు కోచ్లను తయారు చేయడానికి అవసరమైన అన్ని దశలను చూపిస్తుంది.
“వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తయారు చేసే చెన్నైలోని ఐసిఎఫ్ను సందర్శించడానికి ప్రత్యేక అవకాశం లభించింది. మీరు ఎప్పుడైనా రైళ్లు, కార్లు, బైక్లు, విమానాలు తయారు చేసే ప్రదేశానికి వెళ్ళారా?” అని ఈ వీడియోకు కరణ్ క్యాప్షన్ పెట్టారు. దేశంలోని అత్యంత అధునాతన రైలు వందేభారత్ వెనుక ఉన్న సంక్లిష్టమైన ఇంజనీరింగ్, నైపుణ్యాన్ని చూపిస్తుంది. అందుకే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ భారతీయ రైల్వే నెట్ వర్క్ వేగవంతమైన ఆధునీకరణను సూచిస్తుంది. ఏరోడైనమిక్ డిజైన్, మెరుగైన ప్రయాణీకుల సౌకర్యం, ఆధునిక ఆన్ బోర్డ్ సాంకేతికతతో, ఈ రైలు వేగవంతమైన, మరింత సమర్థవంతమైన రైలు ప్రయాణం వైపు దేశం ముందుకు సాగడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Read Also: ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్.. దీని లోపల ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతం అంతే!