Gundeninda GudiGantalu Today episode September 02: ప్రభావతి శివ డబ్బులు ఇవ్వగానే ఆ డబ్బులు దాచుకో అని మీనా అని అంటుంది.. అయితే మీనా మాత్రం ఆ డబ్బులు నేను ఎక్కడ దాచుకుంటాను.. అవసరమైతే బ్యాంకు లాకర్లు కూడా దాచుకుంటాను నీకెందుకు అని ప్రభావతికి దిమ్మతిరిగిపోయేలా కౌంటర్ ఇస్తుంది. కానీ శివ ఎంతగా ప్రభావతి ముందు తలవంచి ఉన్నా కూడా తను మాత్రం అవమానిస్తూనే ఉంటుంది.. ఈరోజు తోడుగా ఉంటాడు కానీ రేపు పెళ్లయిన తర్వాత అదే మాట అంటాడా అని ప్రభావతి కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఆ మాట విన్న బాలు ఇప్పుడే వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తున్నావా అని అంటాడు. ప్రభావతి ఎంత చెప్తున్నా సరే నోరు మూసుకొని ఉండకుండా వాళ్ళిద్దర్నీ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఇక శివా నేను వెళ్తాను అక్క అని అక్కడి నుంచి వచ్చేస్తాడు..
మౌనిక ఇంకా రాలేదు ఇవాళ నా బిజినెస్ అంతా పోయింది అంటూ మనోజ్ చిందులు వేస్తూ ఉంటాడు.. మౌనిక ఎప్పుడొస్తుందో తెలిస్తే అంతవరకు వెయిట్ చేస్తాము అని ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం అస్సలు వినకుండా మొండిగా ఉండాల్సిందే అని అంటాడు.. మీరు ఇక్కడ వెయిట్ చేయడం కంటే మౌనిక దగ్గరికి వెళ్లి కట్టించుకోవడం బెటర్ కదా అని మీనా అనగానే ముగ్గురు అన్నలు కూడా మౌనిక దగ్గరికి వెళ్లేందుకు రెడీ అవుతారు. ఇక ముగ్గురు అన్నలు వెళ్తూ ఉండగా సత్యం.. అది మౌనిక వాళ్ళ ఇల్లు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు అంటూ బాలుకి చెప్తాడు. అయితే అక్కడ ఏ గొడవ పెట్టుకోకుండా రాకే కట్టించుకొని మౌనంగా రావాలి అని చెప్పగానే బాలు సరే నాన్న అని వెళ్ళిపోతాడు.. మౌనిక వాళ్ళ ఇంటిదగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు.
బాలు మౌనిక వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లిన తర్వాత మౌనిక వస్తే బాగుంటుంది. తనని కలవాలి తనతో రాఖీ కట్టించుకోవాలని చాలా సంతోషంగా ఉంటాడు. అయితే బాలుకి మాత్రం వాళ్ళు లోపలికి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో చాలా బాధపడిపోతూ ఉంటాడు. వాచ్మెన్ వచ్చి మౌనిక మేడం వాళ్ళ అన్నయ్యలు వచ్చారు రాఖీ కట్టించుకుని వెళ్తామని అక్కడ అడుగుతున్నారు సార్ అని నీలకంఠ దగ్గరికి వచ్చి చెప్తాడు.. అయితే నీలకంఠం మాత్రం ఇంట్లోకి రానివ్వకూడదు అని ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం వినడు. సువర్ణ రాఖీలు కట్టి వెళ్ళిపోతారండి అని ఎంతగా అడుగుతున్నా నీలకంఠం మాత్రం వాడి ఇంట్లోకి వస్తే రచ్చ రచ్చ చేస్తాడు.. ఈ ప్రోగ్రాం ని ఆగిపోయేలా చేస్తాడు అని నీలకంఠం వార్నింగ్ ఇస్తాడు. బాలుని మాట్లాడడానికి కూడా అనుమతి ఇవ్వకుండా నీలకంఠం దారుణంగా అవమానిస్తాడు.
బాలు తన చెల్లెలుతో రాఖీ కట్టించుకోవాలని ఎన్నో ఆశలతో అక్కడికి వస్తాడు. అయితే బాలుని లోపలికి రానివ్వము వీలైతే మీరిద్దరూ వెళ్ళండి అని నీలకంఠం అవమాని చాలా మాట్లాడతాడు.. వీడు గనక లోపలికి వస్తే నా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం ఆగిపోతుంది కాబట్టి మీరిద్దరు వెళ్లి రాఖీ కట్టించుకుని సైలెంట్ గా బయటికి రావాలి అని చెప్తాడు.. ఇక నా గురించి మీరు ఆలోచించకండి రా మీరైనా కానీ ఆ రాఖీ కట్టించుకోండి అని బాలు లోపలికి పంపిస్తారు. మనోజ్ రవి లకు మౌనిక రాఖీ కడుతుంది. కానీ బాలు మాత్రం బయట బాధపడిపోతూ ఉంటాడు. మనోజ్ ఇలాంటివి చేస్తే ఇలానే జరుగుతుంది అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలి అని అంటాడు.
ఇక బాలు మౌనిక వస్తుంది తనకు రాఖీ కడుతుంది అని గేటు బయట కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు. మిగిలిన వాళ్ళు ఎంతగా చెబుతున్నా సరే బాలు మాత్రం తనకు చెల్లెలు రాఖీ కట్టాలి అని బాధపడిపోతూ ఉంటాడు. మౌనికని లోపలికి తీసుకెళ్లిన సంజయ్ మీ అన్నయ్యకి రాఖీ కట్టావనుకో వాళ్ళిద్దర్నీ చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు.. ఇక దాంతో మౌనిక బయటకు వెళ్లి బాలుతో కఠినంగా మాట్లాడుతుంది. నీకోసం వచ్చానమ్మా నువ్వు రాఖీ కడితే.. ఈ చీర నేను నీకు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నాను అని ఆ చీర ఇవ్వగానే మౌనిక నీకు ఎన్ని సార్లు చెప్పిన బుద్ధి రాదా.. అని అంటుంది. ఆ మాట వినగానే బాలు చాలా బాధపడిపోతాడు.. ఇదొక ముష్టి చరణ మా ఇంట్లో ఇలాంటివి పని వాళ్ళకి ఇస్తాను అంటూ గోరంగా అవమానించాలా మాట్లాడుతుంది ఆ మాట వినగానే బాలు బాధపడిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?