Gundeninda GudiGantalu Today episode September 17th: బాలును మీనా అడ్డంగా ఇరికించేస్తుంది.. సుమతి వాళ్ళ డబ్బులు సెట్ అయ్యాయి అన్న విషయాన్ని ఎలాగైనా సరే బాలుకి చెప్పాలని మేన పదేపదే ఫోన్ చేస్తుంది.. కానీ బాలు మాత్రం నేను కావాలని తాగలేదు అని ఎంత చెప్పినా నన్ను నమ్మవా నేను నీతో మాట్లాడను అంటూ ఫోన్ కట్ చేస్తాడు.. మీనా మాత్రం బాలుకున్న కోపానికి ఎవ్వరూ బ్రతకరు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం ఏంటమ్మా బాలు ఇంకా రాలేదా అని అడుగుతాడు. లేదు మామయ్య ఆయన ఇంకా రాలేదు ఫోన్ చేయడం ఎందుకులే అని నేను ఆగాను అని నేను అంటుంది కానీ సత్యం మాత్రం బాలుకు ఫోన్ చేసి మాట్లాడమని ఇస్తాడు. బాలు సత్యం అనుకోని మాట్లాడతాడు కానీ నేను అని తెలిసి నువ్వా అని అనుకుంటాడు. ఇక వీరిద్దరికి గొడవ ఎపిసోడ్కి కాస్త హై లైట్ గా నిలుస్తుంది.. ఆ తర్వాత సత్యం కూడా త్వరగా ఇంటికి రమ్మని చెప్తాడు.
భర్తకు సేవలు చేసే అవకాశం రోహిణికి దేవుడు కనిపిస్తాడు. జ్వరం అవడంతో రోహిణి దగ్గరుండి తన భర్తకి సేవలు చేస్తుంది.. తన భర్తకి రాత్రంతా మేలుకొని జ్వరం తగ్గేలా రోహిణి చేస్తుంది.. ఎన్ని రోజులైంది మనోజ్ నువ్వు నన్ను ఇలా గట్టిగా పట్టుకొని పడుకొని ఇన్ని రోజులకి మళ్లీ నువ్వు ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అని రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. కాస్త జ్వరం తగ్గిన తర్వాత మనోజ్ రోహిణి దూరం పెట్టేస్తాడు అయినా కూడా రోహిణి మనోజ్ కి జ్వరం తగ్గేలా చేయాలి అని అనుకుంటుంది. మొత్తానికి మనోజ్ కి జ్వరం తగ్గడానికి రోహిణి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అయితే రోహిణి ఉదయం లేవగానే తన పక్కన కూర్చుని ఉండడం చూసిన ప్రభావతి ఏమైంది అని అడుగుతుంది రాత్రంతా మీ అబ్బాయికి జ్వరం అత్తయ్య అని రోహిణి చెప్పగానే ప్రభావతి ఇప్పుడు చెప్తున్నావా నువ్వు బయటే ఉండు లోపలికి వెళ్లదు అని ప్రభావతి టాబ్లెట్ తీసుకొని వస్తుంది.
రోహిణి మనోజ్ కు జ్వరం అని చెప్పగానే ప్రభావతి చాలా కంగారు పడిపోతూ మనోజ్ కి ఏమైందో అనేది చూడాలని టాబ్లెట్లు తీసుకొని వాళ్ల రూమ్ కి వెళుతుంది.. అక్కడ మనోజ్ అలా పడుకొని ఉండడం చూసి ఏంట్రా జ్వరం వచ్చిందా? ఎలా ఉందిరా ఇప్పుడు అంటూ ప్రభావతి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది.. అయితే రోహిణి బయటే ఉండమని చెప్పడంతో సత్యం తన భర్త గదిలోకి తనని రానివ్వకుండా చేయడం తప్పు ప్రభావతి నువ్వు ఇలా చేయడం అసలు బాగోలేదు అంటే దాని గురించి మీకు తెలియదులెండి మీరు రండి అని ప్రభావతి అంటుంది.. మనోజ్ కి అన్ని హీరోయిన్ దగ్గరుండి చేసింది అని చెప్పగానే ప్రభావతి చాలా ఫీల్ అయిపోతుంది.. తన కొడుకుని దూరం చేస్తుంది రోహిణి అని బాధపడిపోతూ ఉంటుంది.. మనోజ్ గదిలోకి నా పర్మిషన్ లేకుండా అస్సలు వెళ్ళద్దు అని వార్నింగ్ ఇస్తుంది.
రెస్టారెంట్లో జరిగిన అవమానాన్ని తలుచుకొని శృతి చాలా బాధపడిపోతూ ఉంటుంది.. అసలు శృతి ఇంతగా బాధపడిపోవడానికి కారణం ఏంటి అని అందరూ అనుకుంటూ ఉంటారు. తనకు రెస్టారెంట్లో అంత అవమానం జరిగినా కూడా రవి ఏ మాత్రం పట్టించుకోలేదని శృతి బాధ పడిపోతూ కోపంగా ఉంటుంది.. రవి వచ్చినా కూడా దానితో మాట్లాడుకున్న మౌనంగా ఉండడంతో శృతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.. నీతో మాట్లాడాలి నీ భార్యని ఒకడు అలా కామెంట్ చేసినా కూడా నువ్వు ఏ మాత్రం పట్టించుకోకుండా రెస్టారెంట్ రేపిటేషన్ అడ్రస్ చేస్తున్నావు.. కొంచెం కూడా నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని శృతి చాలా కోపంతో రవి పై అరుస్తుంది. నీతూ ఫోన్ చేసి శృతికి సారి చెప్పడంతో సంతోషంగా ఉంటుంది. ఇక రవి కూడా శృతి సంతోషంగా ఉంది అని అనుకుంటాడు.
ఉదయం లేవగానే ప్రభావతికి సత్యం కు కాఫీ ఇస్తుంది మీనా.. ఏంటమ్మా వాడు ఇంకా రాలేదా అని సత్యము అడుగుతాడు. లేదు మావయ్య ఇంకా రాలేదు అని చెప్పగానే ప్రభావతి ఎక్కడ పడిపోయాడో ఏంటో అని అంటుంది ఆ మాట వినగానే మీతో సహా సత్యం కూడా చాలా సీరియస్ అవుతాడు. వాడు ట్రిప్ ఉందని వెళ్ళాడు వేరే ఉద్దేశం వాడికి లేదు నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు అని ప్రభావతితో అంటాడు సత్యం. మీరు అనుకుంటున్నారు కానీ వాడు మాత్రం అలా కాదు తాగి పడిపోయే ఉంటాడు అని ప్రభావతి అంటుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలుని చూసి ఎక్కడికి పడిపోయావురా రాత్రి అంత ఎక్కడికి వెళ్లావు షికారు కెళ్ళావా అని అడుగుతుంది ప్రభావతి. అవును కస్టమర్ల్ని ఎక్కించుకొని రాత్రంతా షికార్కెళ్ళాను అని బాలు అనగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మీనా తో గొడవ పడిన బాలు ప్రభావితని కాఫీ అడగడంతో మీనా మీ అమ్మగారి చేత్తో కాఫీ తాగాలని చాలా సంతోష పడిపోతున్నారు అనుకుంటా అలానే మీ అమ్మని అడిగి కాఫీ తాగండి అని అంటుంది..
రోహిణి మనోజ్ కి ఇంకా తగ్గలేదు అని చాలా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి మన లేవగానే మనం ఇప్పుడు నీకు ఎలా ఉంది పర్వాలేదా అని అడుగుతుంది నేను మా అమ్మని అడిగి జావా ఇప్పించుకుంటాను అని. అనగానే దానికోసం అత్తయ్య గారి వర్క్ ఎందుకు వెళ్లడం నేను నీకు జావా చేసి ఇస్తాను అని రోహిణి అంటుంది. కానీ రోహిణి ఎంత చెప్పినా సరే మనోజ్ మాత్రం మా అమ్మ కావాలి అని అడుగుతాడు. నేను నీకోసం జావా తీసుకొని వస్తాను అని రోహిణి వంటగదిలోకి వెళుతుంది. నేనను కాఫీ ఇవ్వమని అడక్కని రోహిణి రెండు స్టవ్వులు వాడేస్తుంది అని చెప్తుంది. రోహిణి మనోజ్ కోసం జావ కాస్తుంది అని ప్రభావతితో చెప్పగానే చాలా సీరియస్ గా వెళ్లి రోహిణి అడుగుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.