Illu Illalu Pillalu Today Episode March 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్టీకి రాడని అనుకున్న రామరాజు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. సంతోషంగా ఉన్నా ఆ పార్టీలోకి రామరాజు రావడంతో ఏంటండీ మీరు ఇక్కడికి వచ్చారు అని వేదవతి అడుగుతుంది. రామరాజు ఎంట్రీ ఇవ్వడంతో పార్టీలోని బంధువులందరూ వెళ్ళిపోతారు. ఉద్యోగాన్ని 25 లక్షలు పెట్టి కొన్నావా నువ్వు అని అడగ్గాని ఒక్కసారిగా నర్మదతో పాటు అందరూ షాక్ అయిపోతారు.. సాగర్ ని రామరాజు ఇంత బుద్ధి తక్కువ పని చేస్తావని కొడతాడు.
డబ్బుల గురించి నర్మదా చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఆ డబ్బులను నా నగలు తాకట్టు పెట్టి కట్టేసాం మావయ్య అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నగలను తాకెట్టు పెట్టి ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అడుగుతారు..రామరాజు ఏం పెంపకం అయ్యా నీది. కొడుకు ఎలా ఉన్నాడో కూడా తెలుసుకోలేనంత దీనస్థితిలో నువ్వు ఉన్నావా ఏంటి..? అసలు ఎలా పెంచావు నీ కొడుకుల్ని ముగ్గురు మూడు లోకాలు ఉన్నారు. ఇకనుంచి వెళ్లిపోండి అని ప్రసాదు రామరాజు కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడుతాడు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నా ఇంటిని కాళీ చేసి వెళ్లిపోండి అని ప్రసాద్ అరుస్తాడు. ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెడితే మర్యాదగా ఉండదు అని అతను వార్నింగ్ ఇస్తాడు దాంతో అందరు కూడా ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కలిసి పెద్ద లొల్లి చేస్తారు.. కన్న తండ్రికి తెలియకుండా పాతిక లక్షలు తీసుకున్నావా అని భాగ్యం ఇంకాస్త ఆద్యం పోసేలా మాట్లాడుతుంది. దాంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు.. శ్రీవల్లి వీడియో కాల్ చేసి భాగ్యంకి అంతా చూపిస్తుంది.. అది చూసిన భాగ్యం చాలా సంతోషంగా ఉంటుంది.. నర్మలకి మనము బుద్ధి చెప్పాలి ఇన్నాళ్లకు ఆ టైం వచ్చేసింది అని భాగ్యం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది..
భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా… ఈ సంతోషాన్ని మరింత సంతోషంగా గడుపుకోవాలని ఆటపాటలతో సందడి చేస్తారు.. ఇక ఇద్దరు కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసి చాలా సంతోషంగా ఉంటారు.. అమూల్య తన జీవితాన్ని నాశనం చేసింది అని విశ్వం బాధపడిపోతూ కోపంగా ఉంటాడు.. అమూల్య నా జీవితాన్ని నాశనం చేస్తుంది.. ఆ అమూల్యని ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదని తన ఫ్రెండుతో మందు తాగుతూ కోపంగా ఉంటాడు విశ్వం.. ఎందుకురా పులిలాంటి నువ్వు ఇలా పిల్లి లాగా మారిపోయావు అని అంటాడు..
ఈ అమూల్య సంగతి ఇవాళ చెప్పేస్తాను అని విశ్వం రెచ్చిపోతూ లోపలికి వెళ్తాడు.. అంత చూస్తానని లోపలికి వెళ్ళిన విశ్వం అక్కడ అమూల్య పడుకొని ఉండడం చూసి ఇంత అందర్నీ ఎలా మిస్ అయ్యాను అని లోపల తన మీద చేయి వేస్తాడు.. అయితే వెంటనే ఉలిక్కిపడి లేచిన అమూల్య విశ్వం ని చూసి భయపడిపోతుంది. ఈరోజు మనిద్దరికీ శోభనం జరిగి పోవాల్సిందే అని విశ్వం అమూల్యకి చుక్కలు చూపిస్తాడు.. కానీ అమూల్య మాత్రం ఎంతగా వదిలిపెట్టమని బ్రతిమలాడిన సరే వదిలిపెట్టడు.. చివరికి అమూల్య విశ్వంకి ఎదురు తిరిగి కొట్టేస్తుంది.. విశ్వం ఒక ఆట ఆడుకొని చుక్కలు చూపిస్తుంది..
Also Read : మీనాక్షికి షాకిచ్చిన పల్లవి..మీనాక్షిని అవని కాపాడుతుందా..? పూజలో ఆరిపోయిన దీపం..
ఇక సాగరు ఇంట్లో డబ్బులు తీసుకొని ఉద్యోగంనికి వెళ్ళాడు అని పెద్ద రచ్చ చేస్తారు.. భాగ్యం శ్రీ వల్లి ఇద్దరు ఎంట్రవడంతో ఈ గొడవ ఇంకాస్త పెరుగుతుంది.. ఇదంతా చేసింది నర్మదా అని అందరూ కలిసి నర్మదని తిట్టిపోస్తారు. నర్మదా ఎంతగా అడ్డుకోవాలని చూసినా సరే సాగర్ ని మాత్రం వేదవతి అస్సలు వదిలిపెట్టదు. ఇలాంటి దిక్కుమాలిన పని చేయడానికి సిగ్గు లేదా అంటూ తిడుతుంది. నర్మదా ఎంతగా చెప్తున్నా సరే.. అందరు కలిసి నర్మదదే తప్పు అని అంటారు.. నర్మదా నా తప్పేమీ లేదని ఎంత చెప్తున్నా సరే వేదవతి మాత్రం వినదు సాగర్ ని కొడుతుంది.. అదేవిధంగా నర్మదని కూడా కొడుతుంది.. రెచ్చిపోయిన సాగర్ తన గురించి ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో నర్మదా సాగర్ ఇద్దరు కూడా ఇంట్లోంచి వెళ్లిపోతారు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…