Intinti Ramayanam Today Episode March 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. అవనిని చంపేందుకు మనం ప్లాన్ చేసాము. అయితే అవని తిరిగి హ్యాపీగా చిన్న గాయంతో ఇంటికి వచ్చింది. అసలు ఏం జరిగింది డాడీ అని పల్లవి అడుగుతుంది.. తనకి గాయమైందంటే ఒక అర్థం ఉంది మరి మీకెందుకు తలకి గాయం అయింది అని చక్రధర్ ని అడుగుతుంది పల్లవి.. ఇప్పుడు అలాంటి ప్లాన్లు ఏమీ లేకుండా మనం కాస్త గ్యాప్ తీసుకోవాలని చక్రధర్ మాట్లాడుతూ ఉంటాడు. అయితే తన తలకి గాయం తగిలిన దృశ్యాన్ని చూసిన పల్లవి అక్కడ ఎందుకు తగిలింది.
మీకు అవనికి ఒకే చోట తగిలిందంటే ఏదో జరిగింది అని డౌట్ పడుతుంది. నేను వెళ్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ జరిగిందమ్మ అందుకే హాస్పిటల్ కి వెళ్లి వచ్చాను అని చక్రధర్ అంటాడు. అయితే ఆవనిని మనం చంపేందుకు ఇంకొక ప్లాన్ పర్ఫెక్ట్ గా వేయాలి డాడీ అని పల్లవి అడుగుతుంది. అవనిని చంపేందుకు మరొక ప్లాన్ చేయాలి అని చక్రధర్ తో పల్లవి మాట్లాడుతూ ఉంటుంది… ఇక అప్పుడే ఒక చెట్టుకొమ్మ కింద పడడంతో చక్రధారిని పక్కన పెట్టి పల్లవి సేఫ్ అవుతుంది అది చూసినా అతను అవని గురించి ఆలోచిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి నేరుగా మీనాక్షి దగ్గరికి వెళుతుంది.. మీనాక్షి లోపల నిజాలు చెప్పకుండా మొండిగా ఉండడంతో పల్లవి రెచ్చిపోతుంది. పల్లవి నీ ఫాలో అవుతున్న కానిస్టేబుల్ అవినీకి ఫోన్ చేసి ఆ లొకేషన్ ని పంపిస్తాడు. ఇక ఆ అవని అక్కడికి చేరుకుంటుంది పల్లవి ఇలాంటి నిర్మానుష ప్రాంతానికి ఎందుకు వచ్చింది అని అనుమానం కలుగుతుంది.. అంటే పల్లవి మా అమ్మని కిడ్నాప్ చేసిందా..? లేదంటే ఇంకేదైనా ఇక్కడ చేస్తుందా అన్నది తెలుసుకోవాలి అని ఫాలో అవుతూ లోపలికి వెళ్ళబోతుంది.. ఇలాంటి ప్రాంతంలోకి పల్లవి ఎందుకు వచ్చింది. ఇంటికి తాళం వేశారు కదా ఇక్కడ ఎవరూ లేరా అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి మనుషులు అక్కడ ఏం చేస్తున్నారు ఇది ఒక భయంకరమైన ప్లేస్. ఇక్కడికి మనుషులు ఎవరూ రావడానికి భయపడుతూ ఉంటారు..
ఇంతకీ మీరెవరు మేము అటుగా వెళుతూ మిమ్మల్ని చూసి ఎవరి ఇటొస్తున్నారు అని చూడ్డానికి వచ్చాము.. రీసెంట్ గానే ఇక్కడ నాలుగు మర్డర్లు కూడా జరిగాయి.. ఇలాంటి ప్రాంతానికి మీరెందుకు వస్తున్నారమ్మ ఇకనుంచి వెళ్లిపోండి అమ్మ అని భయపెట్టేస్తారు.. దాంతో అవని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శ్రీయ శ్రీకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. శ్రీకర్ రాగానే ఈరోజు కూడా లేటుగా వచ్చావా నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది.. తినడం టీవీ చూడ్డం తప్ప నేనేం చేయలేకపోతున్నాను.. కాస్త తొందరగా వస్తే కాసేపు అలా బయటకు వెళ్లి తిరిగి వచ్చేవాళ్ళం కదా అని శ్రియ అంటుంది.. నేనేమీ ఉద్యోగం చేయట్లేదు. బిజినెస్ కాబట్టి ఏ టైం కి వస్తాను ఏ టైం కి పోతానో తెలియదు అని శ్రీకర్ అంటాడు..
నువ్వు చేసే బిజినెస్ వల్ల రూపాయి అన్న లాభం ఉందా నువ్వు నాకు తెలియదు. రేపు మీ అన్నయ్యని అడిగి నీ వాటా ఎంత వస్తుందో కనుక్కో అని శ్రీకర్తో అంటుంది.. ఇక తర్వాత రాజేంద్రప్రసాద్ కి భానుమతి నీళ్లు తాపిస్తూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి పార్వతి రావడంతో ఎక్కడికి వెళ్లావు పార్వతి.. మార్కెట్ కి వెళ్ళావా? కూరగాయలు తీసుకొని వచ్చావా అని భానుమతి అడుగుతుంది.. లేదు అత్తయ్య ఇవి పువ్వులు అని పార్వతి అంటుంది. ఏంటే ఇన్ని పువ్వులు తెచ్చావు అని అనగానే.. ముగ్గురు కోడల్ని పార్వతీ పిలుస్తుంది..
Also Read : ఈ వారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..
నేను ఇందాక ఒక గుడికి వెళ్ళాను అక్కడ మీ మామయ్య గారు ఆరోగ్యం గురించి చెప్పగానే ఒక స్వామీజీ మంత్రించి కొన్ని పువ్వులను ఇచ్చారు. ఆ పువ్వులను ముగ్గురు కోడల చేత దండ కట్టించి దేవుడికి వేసి పూజ చేయమని చెప్పారు. అలా చేస్తే ఇంటికి పట్టిన అపశకునం పోతుందని చెప్పారు. మీరందరూ కలిసి పువ్వులు కట్టండి అని పార్వతి అంటుంది. పువ్వులు కట్టడం రాక ఇబ్బంది పడుతున్న పల్లవిని చూసి కమల్ నవ్వుకుంటాడు. పువ్వులు కట్టడం అయిన తర్వాత పూజకి అన్ని సిద్ధం చేసి దేవుడికి పువ్వులు వేస్తారు. ఆ తర్వాత పూజ చేసిన తర్వాత హారతిస్తుంటే పల్లవి ఇచ్చిన హారతి ఆరిపోతుంది. పల్లవి ఎన్నిసార్లు హారతి వెలిగించిన సరే ఆరిపోతుంది. అందరికీ పల్లవి పై అనుమానం మొదలవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…