E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: చక్రధర్ ను కలిసిన అవని.. దిమ్మతిరిగే షాక్..రాజేశ్వరిని రెచ్చగొట్టిన పల్లవి..

Intinti Ramayanam Today Episode: చక్రధర్ ను కలిసిన అవని.. దిమ్మతిరిగే షాక్..రాజేశ్వరిని రెచ్చగొట్టిన పల్లవి..

Intinti Ramayanam Today Episode December 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ పార్వతి ఇద్దరూ కూడా రాజేశ్వరి చెప్పిన విషయాన్ని ఆలోచించాలని అనుకుంటారు.. నా ఒక్కరి అభిప్రాయం మాత్రమే కాదు కదా ఇంట్లోని వాళ్ళ అందరి అభిప్రాయాన్ని కనుక్కోవాలి కదా అని రాజేంద్రప్రసాద్ అందరినీ అడగాలని అనుకుంటాడు.. అందరూ కూడా చక్రధర్ ను బయటకు తీసుకురావడానికి ఒప్పుకోరు.. వాడిలాంటి దుర్మార్గుడు మళ్లీ బయటకు వస్తే మళ్లీ మనం సమస్యల్లో పడాలి అని అనుకుంటారు.. ముందుగా శ్రీకర్ని అడిగితే శ్రీకర్ అదే సమాధానం చెప్తాడు. అలాగే కమల్ కూడా చక్రధర్ పేరు వినగానే ఆవేశంతో రగిలిపోతాడు.. వాడి లాంటి దుర్మార్గుడ్ని  బయటికి తీసుకొస్తే మనల్ని చంపేస్తాడు అని కమల్ అంటాడు. ఇక ఆ తర్వాత అవన్నీ కూడా అదే సమాధానం చెప్పడంతో భానుమతి అవని పై సీరియస్ అవుతుంది. రాజేశ్వరి ఎంతగా చెప్పిన చక్రధర్ ను విడిపించడానికి ఎవ్వరు ముందుకు రారు..అక్షయ్ మాత్రం నేను రాను అత్తయ్య అని అంటాడు.. అదేంట్రా అలా మాట్లాడుతున్నావ్.. నాకు పతి బిక్ష పెట్టమని అడిగాను వేడుకున్నాను మా ఆయనను తీసుకొని వద్దాం పదండి.. అని ఎంత బ్రతిమిలాడినా సరే అక్షయ్ మాత్రం అస్సలు ఒప్పుకోడు.. దాంతో రాజేశ్వరి నా ఉసురు పోసుకొని ఈ కుటుంబమంతా నాశనం అయిపోతారని శాపాలు పెట్టి వెళ్ళిపోతుంది. ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… రాజేశ్వరి ఎంత చెప్పినా సరే అక్షయ్ వినడు. దాంతో నేను నీకు తల్లిలాగా అడుగుతున్న సరే నువ్వు మాత్రం నీ మనసు మార్చుకోవడం లేదు అని రాజేశ్వరి బాధపడుతుంది. ఎంతగా రాజేశ్వరి నా భర్తను విడిపించండి అని వేడుకున్న సరే అక్షయ్ మాత్రం కరగడు.. అక్షయ్ బాటలోనే కమల్ కూడా నడుస్తాడు.. ఆ దుర్మార్గున్ని బయటకి తీసుకువచ్చే ఫసక్తే లేదు అని అంటాడు.. రాజేశ్వరి మీరందరూ నా ఉసురు పోసుకుంటారు.. ఆడబిడ్డ ఉసురు పోసుకునోళ్ళు ఏ ఒక్కరు బాగు పడినట్లు లేదు.. మీరందరూ నాశనం అయిపోతారు అని శాపాలు పెడుతుంది..

అవని చక్రధర్ని కలవడానికి పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.. అక్కడ చక్రధర్ ఏంటి ఇలా వచ్చావు నాతో మాట్లాడాలని వచ్చావా నేను ఎలా ఉన్నానో చూడాలని వచ్చావా అని అడుగుతాడు. నువ్వు మారిపోయావని పిన్ని చెప్తుంటే నువ్వు మారవో లేదో తెలుసుకుందామని నేను వచ్చాను అని అవని అంటుంది. ఈ పిన్ని దృష్టిలో నేను మారిపోయాను కానీ నేను మారను.. నేనింతే అని చక్రధర్ అనగానే అవని షాక్ అవుతుంది. అవును నువ్వు మారవని నాకు తెలుసు కానీ పిన్ని మారిపోయావు అని చెప్తే నేను చూద్దామని వచ్చాను అని అవని అంటుంది. పట్టిన మగాడిన మర్చిపోతాడు కానీ పగబట్టిన ఆడది మాత్రం అస్సలు మర్చిపోదు అందుకే మీ పిన్ని దగ్గర మంచివాడిగా నటించి రెచ్చగొట్టాను అని చక్రధరంటాడు..

నువ్వు ఈ జన్మకు మారవా భార్యని మోసం చేస్తున్నావని అవని అంటుంది.. నేను మారలేదన్న విషయం నువ్వు మీ పిన్ని దగ్గరికి వెళ్లి చెప్పిన సరే ఆమెను నమ్మదు. ఎంతో అభిమానం గా చూసుకునే మీ పిన్ని కూడా నీపై ద్వేషం పెంచుకుంటుంది అని చక్రధర్ అంటాడు. అక్షయ్ రాజేశ్వరి అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అక్షయ దగ్గరకొచ్చిన అవని ఏమండీ అని అంటుంది.. నేను రాజేశ్వరి అత్తయ్య విషయంలో చేసింది తప్పేనా అవని అని అక్షయ్ అడుగుతాడు. మీరు ఏ తప్పు చేయలేదండి. పిన్ని చెప్పిన విషయం నిజమో కాదో తెలుసుకోవాలని నేను జైలుకు వెళ్లొచ్చాను.. ఆ దుర్మార్గుడు ఏమాత్రం మారలేదు. మారినట్లు నమ్మించినట్లు చెప్పాడు. వాడు మారడు అని నాకు అర్థం అయిపోయింది ఇడియట్ అని సీరియస్ అవుతాడు అక్షయ్.

భానుమతి ఇంట్లోంచి బయటికి వెళ్లాలని అనుకుంటుంది. రాజేంద్రప్రసాద్ ఎక్కడికి వెళ్తున్నావ్ అమ్మా అని అడుగుతాడు. నా కూతురు దగ్గరికి నేను వెళ్తాను రా ఇక్కడ నా కూతురు కన్నీళ్లు తుడిచే వాళ్ళు లేరు కదా అని బాధపడుతుంది. ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు. శ్రీకర్ శ్రీయ కమల్ పల్లవిలు వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్లే ఉంటున్నారు. అవని అక్షయ్ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు.. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి నీ ఇష్టప్రకారమే వెళ్ళిపోతావా అని రాజేంద్ర అడుగుతారు.. అక్షయ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నప్పుడు అత్తయ్య నిర్ణయం గురించి మీరు మాట్లాడే అధికారం లేదు అని పార్వతి అంటుంది. కానీ భానుమతి మాత్రం రాజేంద్రప్రసాద్ మాట వినేసి ఆగిపోతుంది.

Also Read:మీనా కోరికను తీర్చిన బాలు.. సుశీల ఎంట్రీతో ప్రభావతికి షాక్.. సత్యం ఎమోషనల్..

పల్లవి రాజేశ్వర్ కి ఫోన్ చేసి అక్షయ్ బావ అలా మాట్లాడడానికి, కమల్ బావా అలా మాట్లాడడానికి కారణం ఆ అవనినే మామ్.. నువ్వు మంచిది అనుకుంటున్నా అవని ఎంత క్రిమినల్ బ్రెనో అర్థమవుతుందా మామ్ అని రాజేశ్వరిని పల్లవీర్ రెచ్చగొడుతుంది. రాజేశ్వరి నిజంగానే అవని అలాంటిదే అని అనుకుంటుంది. ఇక అవని భోజనం వడ్డించి అందరినీ భోజనానికి రమ్మని పిలుస్తుంది. కానీ ఎవరు కూడా భోజనం చేయడానికి రారు. శ్రీకర్ శ్రీయ ఇద్దరు మాత్రమే భోజనానికి వస్తారు. పల్లవి నీ భోజనానికి పిలిస్తే నేను రాను అని చెప్పేస్తుంది. అక్షయ్ రాజేంద్రప్రసాద్ వాళ్ళ దగ్గరికి వెళ్లి భోజనానికి రమ్మని పిలిస్తే వాళ్ళు రారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్.. పోలీస్ స్టేషన్ లో ధీరజ్.. నర్మదకు అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆరాధ్య.. నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

Brahmamudi Serial Today Episode June 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవోగా ఇందు – ప్రకటించిన రేఖ 

Karthika Deepam 2 Suraj : ‘కార్తీక దీపం 2 ‘ సూరజ్ రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Nindu Noorella Saavasam Serial Today Episode June 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మ 

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

×