Intinti Ramayanam Today Episode june 2nd : ఎంత ప్రయత్నించినా సరే స్పృహలోకి రావడంతో రాజేశ్వర్ కి ఏమవుతుందని టెన్షన్ పడిపోతూ ఉంటారు.. రాజేశ్వరి ఈ పరిస్థితుల్లో ఉన్నాడని కారణం అవనీని మా మామకి ఏదైనా జరిగింది అంటే కచ్చితంగా మిమ్మల్ని ఎవరిని బతకనివ్వను అని పల్లవి సీరియస్గా అంటుంది. రాజేశ్వరి కండిషన్ మాత్రం సీరియస్ గా ఉంటుంది. అందరూ ఏమవుతుందని టెన్షన్ పడిపోతూ ఉంటారు.. ఆమెని చూసిన డాక్టర్లు ఆమె చనిపోయింది అని నిర్ధారించుకుంటారు.. బయటికి వచ్చి ఆమె చనిపోయింది అని చెప్పగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తన కన్నతల్లి ఇక లేదు అని తెలుసుకుని కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. పల్లవిని చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు.
తన తల్లి చనిపోయిందని పల్లవి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. నువ్వు నన్ను అప్పుడే వదిలేసి వెళ్లిపోయావా అమ్మ ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నువ్వు ఇంత తొందరగా వెళ్ళిపోతావని నేను అస్సలు ఊహించలేదు అమ్మ నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వు వెళ్ళిపోయావా అని పల్లవి గుండెలు పగిలేలా ఏడుస్తుంది.. పల్లవిని చూసిన అక్కడున్న వాళ్ళందరూ కూడా బాధపడతారు. ఎంతగా ఓదార్చడానికి ప్రయత్నించినా సరే పల్లవి మాత్రం వినకుండా తన తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఎపిసోడ్కి హైలెట్ సీన్ ఇదే.
రాజేశ్వరి చనిపోయిందని చక్రధర్ బాధపడిపోతూ ఉంటాడు.. అటు అవని కూడా రాజేశ్వరి పిన్ని చనిపోయింది అని చాలా బాధపడిపోతూ ఉంటుంది. అందరూ పల్లవిని చూసి బాధపడుతూ ఉంటారు. చనిపోయిన వాళ్ళు ఇక తిరిగి రారు నువ్వు కంట్రోల్ చేసుకో పల్లవి అని ఎంత చెప్తున్నా సరే తాను మాత్రం తన తల్లి చనిపోయింది. భౌతికంగా లేదు అని బాధ పడిపోతూ ఉంటుంది.. చక్రధర్ రాజేశ్వరి అని దగ్గరకు వస్తుండగా పల్లవి నా తల్లిని ముట్టుకోవడానికి కూడా వీల్లేదు అని గట్టిగా అరుస్తుంది.. తన భార్య చనిపోయింది అందుకు అల్లుడుగారు ఎంత బాధ పడుతున్నారో చూసావా ఏంటి పల్లవి ఇలా మాట్లాడుతున్నావు అని భానుమతి చెప్పిన సరే పల్లవి మాత్రం మాట వినకుండా అవని చక్కగా నా తల్లిని ముట్టుకోవడానికి కూడా వీల్లేదు అని అంటుంది..
చక్రధర్ రాజేశ్వరి అంత్యక్రియలను కూడా చేయలేక పోతాడు. పల్లవి తన భర్త అయినా చక్రధారిని దగ్గరకు కూడా రానివ్వడం లేదు అని చక్రధర్ బాధపడిపోతూ ఉంటాడు.. తలకొరివి పెట్టాల్సింది భర్త లేదా కొడుకు కదా మరి ఎవరు పెడతారు అని పల్లవిని అడుగుతారు. అవని మీరేం బాధపడకండి నాన్న భరత్ చేత తలకొరివి పెట్టిస్తే తను ఆత్మ శాంతి కలుగుతుందేమో అని అంటుంది. పల్లవి భరత్ దగ్గరికి వెళ్లి నిన్ను మా మామ్ కొడుకు లాగా చూసుకుంది కదా.. నువ్వు మా అమ్మకి తలకొరువు పెడతావా అని పల్లవి అడుగుతుంది.. భరత్ అన్ని కార్యక్రమాలలో దగ్గరుండి చేస్తాడు. పల్లవి నిర్ణయం ఏదైనా గాని కొడుకుతో కొరివి పెట్టించుకుంది అని అవని సంతోషంగా ఉంటుంది.. తన తల్లి మంటల్లో కాలిపోతూ ఉండగా పల్లవి దారుణంగా ఏడుస్తుంది.. ఎంతగా ఓదార్చిన సరే తను మాత్రం వినకుండా బాధపడిపోతూ ఉంటుంది.. చక్రధర్ కూడా తన భార్య కాలిపోతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటాడు..
పల్లవి తన తల్లి ఇంటికి వెళ్లి ఫోటో దగ్గర దీపం పెడుతుంది.. అయితే భానుమతి తన కూతురు లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. పల్లవి తన తల్లి లేదు అని బాధ పడిపోతూ దీపం పెట్టడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తారు.. అప్పుడు ఇంట్లోకి చక్రధర్ తన ఫ్రెండ్ తో రావడం చూసిన పల్లవి ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు అని చక్రధాన్ని దారుణంగా అవమానించి బయటకు పంపిస్తుంది. భానుమతి ఎంత చెప్తున్నా సరే వినకుండా పల్లవి చక్రధరిని బయటికి పంపించేస్తుంది.. తన భార్య లేదు అని కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అవుతాడు చక్రధర్.. భానుమతి వచ్చి నా కూతురు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఇలా చేసింది ఇప్పుడు తన కూతురు కూడా అలానే చేస్తుంది మీరేం బాధపడకండి అల్లుడుగారు అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. అటు పార్వతి వాళ్లు కూడా రాజేశ్వరి చనిపోయిందని బాధపడిపోతూ ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Gundeninda Gudigantalu Mounika : ‘గుండెనిండా గుడిగంటలు’ మౌనికను తీసేశారా..? ఏం జరిగిందంటే..?