Intinti Ramayanam Today Episode March 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేశ్వరి ఇంటికి వెళ్లి వచ్చిన అవని పార్వతి ఇద్దరూ కూడా పల్లవిని సీరియస్గా చూస్తూ ఉంటారు. అక్షయ్ అత్తయ్య ఏమంటుంది.. అని అన్నా కూడా పార్వతి మాత్రం ఆమె ఎప్పటిలాగే కోపంగా ఉంది అవనికి మాత్రం చాలా ఓపిక ఉంటుంది. అవని చాలా మంచిది ఇంత ఓపికగా ఉండడానికి తనకి ఆ దేవుడు అంత శక్తి ఇచ్చాడు అని పార్వతి అవని పై పొగడ్తలు వర్షం కురిపిస్తుంది.
కానీ పల్లవిని ఇండైరెక్టుగా తిట్టేస్తుంది పల్లవి అత్తయ్యకి ఏమైంది నామీద ఊరికే చిరాకు పడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. శ్రేయ ఎంతగా పల్లవిని విసిగించిన సరే పల్లవి మాత్రం మౌనంగా తన పని ఏంటో తాను చేసుకుంటూ వెళుతుంది. భానుమతి రాజేశ్వరి కి ఎంత చెప్పిన సరే చక్రధర్ కి దగ్గర అవ్వడానికి ఒప్పుకోదు. చక్రధర్ తో మంచిగా ఉండాలని ఎంత చెప్తున్నా సరే రాజేశ్వరి కఠినంగా ఉంటుంది. కమల్ పల్లవిల మధ్య రొమాంటిక్ టచ్ మొదలవుతుంది. ఎపిసోడ్కి అదే హైలెట్గా నిలుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం భూమి పూజకు వెళ్లాలని అందరూ హడావిడిగా రెడీ అవుతుంటారు. అయితే అవని ఇంకా పల్లవి లేవలేదు ఏంటి అని పల్లవి దగ్గరికి వెళ్తుంది.. పల్లవి పడుకుని ఉండడం చూసి అక్కడ ఉన్న వాతావరణం చూసి తాను మా అందరితో సంతోషంగా లేకపోయినా భర్తతో సంతోషంగానే ఉంది అని అనుకుంటుంది.. పల్లవిని లేపితే పల్లవి నిద్రలో కూడా నాకు అదే గొంతు వినిపిస్తుంది. ఏంటి అని అంటుంది. కానీ చివరికి పల్లవిని లేపడంతో పల్లవి హడావిడిగా అన్ని పనులు చేస్తానక్కా కాస్త లేట్ అయింది అని అంటుంది.. కానీ పూజకు వెళ్లాలి నువ్వు వెళ్లి స్నానం చేసి రెడీ అవ్వు అని పల్లవి తో అవని అంటుంది..
అందరూ కలిసి రెడీ అయ్యి బయటకు వస్తారు.. చక్రధర్ ఇది నిజాన్ని ఎలాగైనా సరే తాను అవనీత చెప్పాలి అని అనుకుంటాడు. ఇకపోతే మీనాక్షి దగ్గరికి వెళ్లిన చక్రధర్ ను చూసి మీనాక్షి చాలా సంతోషపడుతుంది.. ఈ ఆ తర్వాత మీరు ఇక్కడికి వస్తారని అసలు ఊహించలేదండి అని అంటుంది.. ఎందుకు వచ్చావు అని అడుగుతావని అనుకున్నాను కానీ మీరు వస్తారని అనుకోలేదు అని అనడంతో నా మనసు ఇది అయిపోయింది మీనాక్షి అని చక్రధర్ అంటాడు.. లోపలికి రండి మీకు ఇష్టమైన సొంటిటీని పెట్టుకుని వస్తాను అని మీనాక్షి అంటుంది..
నీ చేతి వంట తిని చాలా ఏళ్లయింది కదా నాకు ఏదైనా చేసి పెట్టవా అని అడిగితే.. అయ్యో మీరు అడగలే గాని నేను ఎందుకు చేసి పెట్టనండి అని మీనాక్షి వెళ్లి అన్నం చేసుకొని వస్తుంది.. అందరూ కలిసి భూమి పూజకు వెళ్తారు.. అక్కడ పూజ జరుగుతున్న సమయంలో పీటల మీద కూర్చోవాల్సిన జంటలు వచ్చి కూర్చోండి టైం అవుతుంది అని పంతులు చెప్పడంతో.. అవని నేను పల్లవి జంటలనుగా కూర్చుంటాము అని అంటుంది. పార్వతి మాత్రం నువ్వు కూర్చోవడానికి వీల్లేదు భూమి పూజ అంటే చాలా స్వచ్ఛమైన పూజ ఇందులో కేవలం అక్షయ అవనీలు మాత్రమే కూర్చుంటారు అని అంటుంది. ఆ మాట వినగానే పల్లవి ఎందుకు అత్తయ్య అని అడుగుతుంది.. ఇంకేమీ మాట్లాడకుండా పార్వతి వాళ్ళని మాత్రమే కూర్చొని ఇవ్వు అని అంటుంది..
పక్కనే ఉన్న శ్రేయ పల్లవి వెనక్కి వెళ్ళిపోవడంతో పల్లవికి గోరా అవమానం జరిగింది కదా అనేసి అనుకుంటుంది.. అది విన్న పల్లవి పార్వతీపై అవని పై చాలా కోపంగా ఉంటుంది.. ఇక మీనాక్షి చక్రధరికి వడ్డించి అన్నం తినమని చెప్పే లోపల భరత వస్తాడు.. ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకేం పనుంది. ఇక్కడికి వచ్చావు అని ఎంతగా చెప్తున్నా సరే మీనాక్షి మాట కూడా వినకుండా భరత్ రెచ్చిపోతాడు. అన్నం తినే వాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదా నీకు అన్నం తినే అంతవరకు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు అని మీనాక్షి కండిషన్ పెడుతుంది.. దాంతో చక్రధర్ కూడా వెంటనే భోజనం తినేస్తాడు.. ఆ తర్వాత భరత్ నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే నీ కోసమే వచ్చానని అంటాడు..
Also Read : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ బ్లాక్ బాస్టర్..!
నాకోసం నువ్వు రావాల్సిన అవసరం లేదు కన్నతండ్రి ఎవరో తెలియకుండా పెరిగినందుకు మేము ఎన్ని బాధలు పడ్డాము.. మాకు తెలుసు ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చిన మమల్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు.. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని భరత్ అంటాడు.. ఇక తర్వాత చక్రధర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అవనిని చంపేందుకు పల్లవి ప్లాన్ చేస్తుంది. మరి చక్రధర్ అవనీని కాపాడుతాడా లేదా అన్నది తెలియాల్సింది.