Intinti Ramayanam Today Episode November 18th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే ఊరుకోను అని పల్లవికి చక్రధర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.. తర్వాత మా అమ్మాయి చేసిన పనికి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అని మీనాక్షిని క్షమించమని అడుగుతాడు.. పల్లవి మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి లోపలికి వెళ్ళు అని కమల్ అనగానే పల్లవి లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా అడ్డంగా ఇరుక్కున్నాను ఏంటి? చ డాడ్ వల్ల ఇదంతా ఫెయిల్ అయింది అని అనుకుంటుంది. చక్రధర్ నేను అనుకున్నదే జరుగుతుంది నా సొంత కూతురు దగ్గరే నేను విలన్ గా మారాల్సి వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అవని ఫోన్ చేసి చెప్పింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇవాలే నా గురించి అన్ని నిజాలు బయటపడేవి అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు..
అప్పుడు అక్కడికి వచ్చిన అవని.. నా తండ్రి ఏంటో ఎవరు వచ్చారు అంటే కచ్చితంగా నీ కూతురే ఈ పని చేసిందని నేను అనుకుంటున్నాను అందుకే నీకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను అని అంటుంది. నీ కూతురు ఇలాంటి పనులు చేస్తుంది కాబట్టే నేను నీకు ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పాను ఇలాగే ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు కాబట్టి ఎక్కడికి రమ్మన్నా నువ్వు రావాలి రెడీగా ఉండు అని చక్రధర్ కి హెచ్చరిస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీకర్అ మ్మానాన్న మీరిద్దరూ ఈ కార్లో కూర్చోండి ముందుగా మనం వెళ్లి పూజ చేయించుకుని వద్దామని శ్రీకర్ అంటారు రాజేంద్రప్రసాద్ పార్వతి కార్లో కూర్చుంటున్నగా శ్రీయ ఆగండి ఈ కారు నేను ఇష్టంగా కొన్నాను ముందు నేనే కూర్చోవాలి అని అంటుంది. శ్రీకర్ ఒకపక్క అమ్మ నాన్న కూర్చొనివ్వు అని ఎంత అన్న కూడా శ్రీయ నేను కూర్చుంటాను లేదంటే ఎప్పటికీ ఈ కారులో కూర్చొని అంటుంది. ఇక ఆ తర్వాత అవని చెప్పిన సరే శ్రీయ మాట వినదు.. రాజేంద్రప్రసాద్ వాళ్ళనే వెళ్లి పూజ చేయించుకొని రానివ్వు అని అంటాడు. అతనికి శ్రీయ అనుకున్నది సాధిస్తుంది.
అక్షయ్ ఫీల్డ్ కు వెళ్తాను అని అక్షయ్ వెళ్తాడు. దారిలో అవనిని మోసం చేయించుకొని రాసినవాడు అని తెలుసుకున్న అక్షయ్ వాడితో నిజం చెప్పించాలని అనుకుంటాడు. వాన్ని పట్టుకొని అరేయ్ అసలు నువ్వు నీతో ఎవరి పని చేయించారు నిజం చెప్పరా అని అక్షయ్ అడుగుతాడు. ఎవడ్రా నువ్వు నేను నిజం చెప్పాలి అని ఆ వ్యక్తి అంటాడు. మా ఆవిడ అవని చేత దొంగ సంతకాలు చేయించి ఇంటిని లాక్కున్నావ్ ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా నీ చేత ఎవరు ఈ పని చేయించారు. నువ్వు నిజం చెప్పకపోతే కచ్చితంగా నా చేతిలో చస్తావు అని అక్షయ్ అతన్ని దారుణంగా కొడతాడు.. దాంతో ఆ వ్యక్తి భయపడి నేను నిజం చెప్తాను నా చేత ఈ పని చేయించింది మీ మావయ్య చక్రధర్ అని అంటాడు..
ఆ మాట వినగానే అక్షయ్ ఆవేశంగా చక్రధర్ దగ్గరికి వెళ్తాడు. నిజం తెలుసుకున్న అక్షయ్ వెంటనే చక్రధర్ ఇంటికి వెళ్తాడు.. రేయ్ చక్రధర్ అని అరుస్తూ వెళ్తాడు. పైన ఉన్న చక్రధర్ ఫైల్ ని కింద పడేసి పరిగెత్తుకుంటూ కిందకు వస్తాడు. మేము మీకేం అన్యాయం చేసామని నువ్వు మమ్మల్ని ఇలా రోడ్డుమీద పడేలా చేశావు అని అడుగుతాడు. నేనేం చేశాను నాకేం సంబంధం ఉంది అని చక్రధర్ కూడా అక్షయ్త్ ని అడుగుతాడు. మీ ఇంటిని నేనే వేరే వాళ్ళకి దక్కేలా చేశాను అనడానికి నీ దగ్గర ప్రూఫ్ ఉన్నాయా ముందు అవి చూపించు అని చక్రధర్ అంటాడు. వాటిని చూపించి అప్పుడు మాట్లాడు నాకు నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు నేనంటే గిట్టని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరూ నా పేరు చెప్తే నువ్వు నేనే చేశానని ఎలా నమ్ముతావని చక్రధర్ అంటాడు..
Also Read : బాలుకు అపూరమైన గిఫ్ట్.. మీనా ఫుల్ హ్యాపీ..మౌనికకు సంజయ్ షాక్..
ఇక తర్వాత ఇంట్లోనే వాళ్ళందరినీ అక్షయ్ ఆవేశంగా పిలుస్తాడు. ఏంట్రా ఏమైంది ఎందుకలా అరుస్తున్నావ్ అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. మన ఆస్తులు పోవడానికి కారణం ఎవరో తెలుసా అని అక్షయ్ అనగానే కమల్ ఎవరు చెప్పు అన్నయ్య వాడి అంతు చూస్తాను అని అంటాడు. మరేవరో కాదు చక్రధర్.. ఈ పల్లవి వాళ్ళ నాన్ననే అని అనగానే అందరూ పల్లవి వైపు సీరియస్గా చూస్తారు. పల్లవి మాత్రం అక్షయ్ మాట విని షాక్ అయిపోతుంది. మా నాన్న ఇదంతా చేశాడు అనడానికి మీ దగ్గర ఏంటి సాక్ష్యం ఉంది అని పల్లవి అడుగుతుంది. పలుకుబడి ఉన్నా వ్యక్తి మీద ఇలాంటి నిందలు వేస్తారని పల్లవి అనగానే అన్ని ఆధారాలు దొరికిన తర్వాత అప్పుడు మాట్లాడుతాను అని అక్షయ్ అంటాడు. తర్వాత అవని తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే దొరుకుతారు మనకు ఏదో ఒక దారి ఉంటుంది అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..