E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు పల్లవి ప్లాన్.. అయ్యో పార్వతి.. సీన్ రివర్స్..

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు పల్లవి ప్లాన్.. అయ్యో పార్వతి.. సీన్ రివర్స్..
Advertisement

Intinti Ramayanam Today Episode September 14th : పల్లవిని చూసినప్పుడల్లా పార్వతి చాలా భయపడిపోతూ ఉంటుంది.. అసలు ఏమైంది పల్లవి ఎందుకు అత్తయ్యని చూసి భయపడిపోతుంది అత్తయ్య కూడా అంతే పల్లవి చూసినప్పటి నుంచి కంగారు పడిపోతున్నారు అని అవని ఆలోచిస్తూ ఉంటుంది అయితే పార్వతీ మాత్రం పల్లవిని నా కుటుంబాన్ని ఏమీ చేయొద్దు నీ గురించి నేను ఎవరికీ ఏమీ చెప్పను అని బ్రతిమలాడుతుంది కానీ పల్లవి మాత్రం ఈ కుటుంబం నాశనం అవ్వాలని నేను ఇంట్లో అడుగు పెట్టాను అలాంటిది ఈ కుటుంబం సంతోషంగా ఉంటే నేను ఎలా ఊరుకుంటాను అని అనుకుంటుంది తీసుకొని పల్లవి లోపలికి వెళ్ళగానే పార్వతి కంగారు పడిపోతూ ఉంటుంది.

కమల్ కన్నీళ్లు..

కమల్ గదిలో ఒంటరిగా పడుకొని బాధపడిపోతూ ఉంటాడు నువ్వు ఇలా బాధపడిపోతేనే నాకు చాలా సంతోషంగా ఉంది బావ అని పల్లవి మనసులో అనుకొని సంతోష్ పడిపోతూ ఉంటుంది తండ్రి కోసం నువ్వు ఇంత బాధ పడిపోతున్నావు రేపు తల్లి పోతే ఏం చేస్తావో అని పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక కమల కోసం భోజనం తీసుకురావాలని పల్లవి తనకోసం భోజనం తీసుకొని వస్తుంది. కానీ కమల్ మాత్రం నాకు ఆకలి వేయట్లేదు చాలా బాధగా ఉంది. అంటూ అంటాడు ఆ మాట వినగానే పల్లవి నువ్వు బాధపడడమే నాకు కావాలి అని మనసులో అనుకుంటుంది. కానీ పైకి మాత్రం మనం చనిపోయిన వాళ్ల గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప వాళ్ళు తిరిగి రారు కదా బావ.. ఈ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి అని పల్లవి అంటుంది. కానీ కమల్ మాత్రం పల్లవిని పట్టుకొని తండ్రి కోసం ఎమోషనల్ అయిపోయి చిన్న పిల్లల్లాగా ఏడ్చేస్తాడు. నీతో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ ఇలా ఏర్పడమే నాకు కావాలి అని పల్లవి మనసులో అనుకుని చాలా సంతోషంగా ఉంటుంది.

పల్లవికి కొత్త టెన్షన్..

Advertisement

అందరూ రాజేంద్రప్రసాద్ చనిపోయాడని బాధ పడిపోతూ ఉంటారు. అయితే పల్లవి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ పల్లవి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మావయ్య గారికి నా గురించి తెలిసింది కాబట్టి ఆయన చనిపోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా గురించి నిజం తెలియడంతో అత్తయ్య గారు ఎక్కడ చెప్తారు అని నాకు భయమేస్తుంది. నన్ను చూస్తేనే అత్తయ్య భయపడిపోతుంది ఎప్పుడు నా గురించి నిజం చెప్తుందని నాకు కంగారుగా ఉంది అని పల్లవి చాలా కంగారు పడిపోతుంది. ఎలాగైనా సరే పార్వతీ నోరు ముయ్యాలి అని ఆలోచిస్తుంది.. నా గురించి నిజం తెలిసిపోతే నన్ను ఇంట్లో ఉండనివ్వరు చంపేస్తారు అని పల్లవి భయపడిపోతూ ఉంటుంది.

పార్వతిని చంపేందుకు ప్లాన్..

నా గురించి నిజం తెలియకుండా ఉండాలి అంటే అత్తయ్య బతికి ఉండకూడదు. నా గురించి నిజం తెలుసునా అత్తయ్య చావాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను. అయితే పార్వతి నన్ను చూస్తే భయపడి పోతుంది. అవని గట్టిగా అడిగితే అత్తయ్య నా గురించి నిజం చెప్తుంది. పార్వతిని ఎలాగైనా సరే పక్క ప్లాన్ చేసి చంపాలి అని పల్లవి అనుకుంటుంది. అత్తయ్యని ఎలాగైనా సరే మట్టిలో కలిపేసేంతవరకు నాకు నిద్ర పట్టదు అని పల్లవి గట్టిగా నిర్ణయించుకుంటుంది. పార్వతి బతికుంటే తన ఆటలు సాగవు అని పల్లవి ఎలాగైనా సరే పార్వతీని చంపాలి అని అనుకుంటుంది. అత్తయ్యకి నిజం చెప్పేది చంపేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి.. కమల్ మాత్రమే నిజం అమ్మకు తెలిస్తే అమ్మ తట్టుకోలేదు అని బాధపడిపోతూ ఉంటాడు.. మా అమ్మ ఏం చేసినా కూడా సంతోషంగా ఉండాలి అందుకోసం నాన్న చనిపోయాడు అన్న బాధని నాలోనే దాచుకొని అమ్మని సంతోషంగా చూసుకోవాలి అని అనుకుంటాడు.

సీన్ రివర్స్..

Advertisement

పార్వతి శ్రీరాములు అమ్మ చనిపోవడం నాకు చాలా బాధగా ఉంది అని ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుంది. అక్షయ్ ఎలాగైనా సరే ఆ అస్థికలను గోదాట్లో కలపాలి అని అందరికీ చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక ఆవిడని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎవరు ఈవిడ మన ఇంటికి ఎందుకు వచ్చింది అని భానుమతి అడుగుతుంది. చనిపోయింది అనుకున్నా ఆవిడ ఈవిడే శ్రీరాములు వాళ్ళ అమ్మగారు అని పార్వతి అనగానే ఏం జరుగుతుంది అని భానుమతి అడుగుతుంది. పల్లవి ఏమీ చేయకుండానే అంత జరిగిపోతుంది అని చాలా సంతోషంగా ఉంటుంది. అసలు పల్లవి ఇలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు ఎలాగైనా సరే ఈ నిజాన్ని ఇంకాస్త పెంచేసి పార్వతి చావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

పార్వతికి అనుమానం..

పార్వతి ఏం జరుగుతుంది రా బతికున్న ఆవిడని ఎందుకురా చంపేశారు అసలు ఎవరు చనిపోయారు అని ఆవేశంగా అడుగుతుంది. పల్లవి మన చేతికి మట్టి అంటకుండా అంతా అలా జరిగిపోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. భానుమతి కూడా బతికున్న వాళ్ళకి పిండం పెట్టడం ఏంట్రా అసలు మీరు పిండం పెట్టింది ఎవరికి ఇంట్లో ఎవరికైనా అయిందా నిజం చెప్పండి రా అని గట్టిగా కేకలు వేసి అరుస్తుంది. ఎవరికి ఏం జరిగింది నిజం చెప్పండి అని పార్వతి కూడా అరవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అవని అత్తయ్యకి నిజం తెలిస్తే ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ పార్వతి గట్టిగా అడగడంతో అత్తయ్య గారు నేను చెప్పేది వినండి అని అంటుంది. అవని ఏం చెప్తుంది అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి భద్ర వార్నింగ్.. ధీరజ్ కు మైండ్ బ్లాక్.. రామరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..

Related News

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ రివర్స్.. తాయారును రెచ్చగొట్టిన నారాయణ..పంతులు ప్లాన్ సక్సెస్..

Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి భద్ర వార్నింగ్.. ధీరజ్ కు మైండ్ బ్లాక్.. రామరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 పరిస్థితి ఏంటి..?

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

నటరాజ్ మాస్టర్ సినిమాలకు కొరియోగ్రఫీ చేయకపోవడానికి అదే కారణమా.. క్రెడిట్ అంతా వాళ్ళదేనా?

పిల్లలు లేరంటూ విమర్శలు… ఆ తప్పు చేయకపోయి ఉంటే బాగుండేది: నటరాజ్ మాస్టర్

అనిల్ రావిపూడి తప్పు చేశారు..కావాలనే తొక్కేసారు .. ఆ షో పై నటరాజ్ మాస్టర్ ఫైర్

Big Stories

Advertisement
×