Nindu Noorella Saavasam Serial Today Episode: స్కూల్ ఎన్నికల పోలింగ్ అయిపోయాక ప్రిన్సిపాల్ రిజల్ట్ అనౌన్స్ చేయడానికి స్టేజీ మీదకు ఎక్కుతుంది. ఎన్నికల గురించి మాట్లాడుతుంది. ప్రశాంతంగా ఓటింగ్ పూర్తి అయ్యింది. దాదాపు అందరూ స్టూడెంట్స్ ఓట్లు వేశారు. ఇది గొప్ప విషయం అంటూ మాట్లాడుతుంది. మరోవైపు సరస్వతి మేడం కోసం వెతుకుతున్న మనోహరి దగ్గరకు మిస్సమ్మ వెళ్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు మను.. ఎవరి కోసం వెతుకుతున్నావు.. అని అడుగుతుంది. నేను వెతకడం ఏంటి..? నేను పిల్లల ఎలక్షన్స్ కోసం వచ్చాను.. అని చెప్తుంది. దీంతో నువ్వు ఎందుకు వచ్చావో ఎవరిని వెతుకుతున్నావో నాకు బాగా తెలుసు.. అంటుంది మిస్సమ్మ.. దీంతో మనోహరి ఏయ్ నువ్వు ఎవరి గురించి అంటున్నావు అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ.. నేను చెప్పేది సరస్వతి వార్డెన్ గారి గురించి అని చెప్పగానే మను షాక్ అవుతుంది.
ఏం మాట్లాడుతున్నావు భాగీ మా సరస్వతి వార్డెన్ ఇక్కడిక వచ్చారా..? అంటుంది. దీంత మిస్సమ్మ మీర అమాయకంగా మాట్లడకు మను నాకు అన్నీ తెలుసు..? అని చెప్తుంది. ఏం తెలుసు.. నీకు అని మను అడగ్గానే.. సరస్వతి మేడం ఇక్కడకు వచ్చారని తెలుసు.. ఆవిడ నాకు ఏదో చెప్పాలని చూస్తున్నట్లు నాకు తెలుసు.. ఆవిడ నాకు చెప్పకుండా నువ్వు అడ్డుపడుతున్నట్టు నాకు తెలుసు అంటుంది మిస్సమ్మ. దీంతో మనోహరి కోపంగా ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా..? నేనెందుకు అడ్డు పడతాను.. నాకేంటి అవసరం..? అంటుంది మను.. దీంతో మిస్సమ్మ నీ అవసరం ఏంటో నాకు తెలుసు మను అంటుంది. దీంతో తెలుసు తెలుసు అంటున్నావు.. అసలు నా గురించి నీకేం తెలుసు..? అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ చాలా తెలుసు కానీ కొన్ని డౌట్లు ఉన్నాయి. అవి సరస్వతి మేడం దగ్గర క్లియర్ చేసుకుంటాను. నీ మీద నా అనుమానం కన్ఫం అయిన మరుక్షణ నా రియాక్షన్ వేరేలా ఉంటుంది. అని చెప్పగానే..
ఏం చేస్తావే నువ్వు అంటుంది మను. దీంతో మిస్సమ్మ నేను ఏం చేస్తానో ఆ రియాక్షన్ వినాలని ఉందా..? చెప్పు మనోహరి నా రియాక్షన్ రిజల్ట్ వినాలని ఉందా..? అనగానే.. ప్రిన్సిపాల్ మాట్లాడుతున్న మాటలు వినిపిసతాయి. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో బంటి మీద ఆనంద్ గెలిచాడు అని చెప్తుంది. మనోహరి షాక్ అవుతుంది. విన్నావు కదా అద విషయం చెడు మంచి విజయం సాధిస్తుంది. చెడ్డవారు తాత్కాలికంగా గెలుస్తారు. బంటి లాగా నీలాగా..? కానీ చివరికి గెలిచేది మంచే.. ఆనంద్ లాగా నాలాగా..? ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు సరస్వతి వార్డెన్ను కలుస్తాను.. ఈరోజు కాకపోయినా ఆ రోజు నీకు కచ్చితంగా ఎండ్ కార్డు పడుతుంది మను. అని చెప్పగానే.. మను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అందరూ హ్యాపీగా ఉంటారు..
తర్వాత ఇంటికి వెళ్లగానే.. సరస్వతి వార్డెన్ తనను కలవడానికి స్కూల్కు వచ్చిన విషయం చెప్తుంది. దీంతో అమర్ ఏంటి భాగీ నువ్వు చెప్పేది అని అడుగుతాడు. అవునండి నన్ను కలవడానికి సరస్వతి వార్డెన్ గారు స్కూల్కు వచ్చారంట అని చెప్పగానే.. అమర్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. మరోవైపు చిత్ర అసలు వార్డెన్ స్కూల్కు ఎందుకు వచ్చింది అని మనోహరిని అడుగుతుంది. ఇంకెందు వచ్చి ఉంటుంది భాగీతో నా గురించి చెప్పడానికే అయ్యుంటుంది అంటుంది మనోహరి. ఇంకోవైపు మిస్సమ్మ మాట్లాడుతూ నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంజుతో చెప్పిందట అంటుంది.
దీంతో సరస్వతి వార్డెన్ నీతో ఏమి చెప్పాలనుకుంటారు.. అని అమర్ అడగ్గానే.. నాకు తెలిసి ఆరు అక్క గురించే అయ్యు ఉంటుందండి.. అంటుంది. దీంతో అమర్, రాథోడ్, మిస్సమ్మ సరస్వతి మేడం ను వెతకడానికి వెళ్తారు. వాళ్లు వెళ్లిపోయాక రణవీర్, మనోహరి, లాయరుతో కలిసి చంభా.. అమర్ ఇంటికి వస్తుంది. ముగ్గురికి తాయెత్తులు కట్టిన చంభా.. ఆరును పట్టుకోవడానికి ఇంట్లోకి వెళ్తుంది. ఆరు వెళ్లి కనిపించకుండా దాక్కుంటుంది. దీంతో గార్డెన్లోకి వచ్చిన చంభా మంత్రం వేస్తుంది. వెంటనే ఆరు చంభా ముందుకు వస్తుంది. ఆరు ఆత్మను చూసిన రణవీర్, మనోహరి, లాయరు భయపడిపోతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం