Nindu Nurella Savasam Aru: ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అందులో ఈమధ్య ఎక్కువగా క్రేజ్ ని సంపాదించుకున్న సీరియల్ అంటే నిండు నూరేళ్ల సహవాసం. ప్రస్తుతం టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న సీరియల్స్లలో ఇదే మొదటి వరుసలో ఉండడం విశేషం.. ఈ సీరియల్లో హీరోయిన్గా నటించిన అరుంధతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ పాత్రలో నటించింది ప్రముఖ బుల్లితెర నటి పల్లవి గౌడ.. ఈమె గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటికే స్టార్ మా లో, జీ తెలుగులో వరుసగా సీరియల్స్ చేసి బిజీ స్టార్ అయిపోయింది.. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది పల్లవి గౌడ.. ప్రస్తుతం ఈమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో ఓ వార్త సంచలనంగా మారింది. పల్లవి ఇప్పటివరకు సీరియల్స్ ద్వారా ఎంత సంపాదించింది? ఆమె ఆస్తులు విలువ ఎంత ఉంటుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఆ ఆస్తులు వివరాల గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..
తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న కన్నడ బ్యూటీ పల్లవి గౌడ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొద్ది రోజులు సీరియల్స్ కి దూరమైంది. అయితే కొన్ని కారణాలవల్ల ఆమెను బ్యాన్ చేశారంటూ వార్తలు కూడా వినిపించాయి.. మళ్లీ ఇప్పుడు సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది. ఎన్నో ఏళ్లగా టీవీ రంగంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆస్తులు వివరాలను చూస్తే.. బెంగళూరులో ఈమెకు పలు ఏరియాలో ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది.. సొంతంగా ఇల్లులు, ఒక కారు, కొన్ని వ్యాపారాల్లో కూడా ఈమె పెట్టుబడులు పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఈమె అంత సంపాదించింది అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు..
Also Read :జ్యో ప్లాన్ సక్సెస్.. పారిజాతం మాటలకు ఫ్యూజుల్ అవుట్.. నిజం బయటపడుతుందా..?
ఈమె పుట్టింది బెంగళూరులో అయినా కూడా అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తూ తన నటనతో అందరినీ అలరిస్తూ వస్తుంది. తెలుగు, తమిళం అలాగే మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. సినిమాల్లో చేయాలనే కోరికతో ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో కూడా నటించి తన నటనతో వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.. అయితే పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఆ తర్వాత బుల్లితెరపై వరుసగా సీరియల్స్ తో బిజీగా మారింది. పసుపు కుంకుమ, సావిత్రి, చదరంగం, సూర్యకాంతం, ఇప్పుడు నిండు నూరేళ్ల సావాసం వంటి సూపర్ హిట్ సీరియల్లో నటించింది. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈవెంట్లలో ఈమె ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోయింగ్ ఎక్కువే.. ఇంస్టాగ్రామ్ లో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను తన అందంతో ఆకట్టుకుంటుంది..