Tv Actress : చాలామంది యాక్టర్స్ సీరియల్స్లలో నటిస్తూ మంచి క్రేజీని సంపాదించుకొని సినిమాల్లోకి వెళ్తారు. కానీ కొంతమంది యాక్టర్స్ మాత్రం సినిమాలలో నటించి బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈమధ్య సీనియర్ హీరోయిన్ల ఎంట్రీ కామన్ అయిపోయింది. తల్లి పాత్రలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. కానీ హీరోయిన్ మెటీరియల్ అయినా సుహాసిని మాత్రం బుల్లితెరపై మాత్రమే సీరియల్స్ చేస్తూ బిజీగా గడుపుతుంది. ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సీరియల్స్లలో హీరోయిన్గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అయితే సుహాసిని ఇప్పుడు బుల్లితెరకు కూడా దూరం అవుతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. ఆమె ఎందుకు సీరియల్స్ కి గుడ్ బై చెబుతుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. మరి సుహాసిని ఎందుకు సీరియల్స్ కి బ్రేక్ ఇస్తుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెరపై పలు సీరియల్స్లలో నటిస్తూ ప్రేక్షకులను తన నటనతో మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్లలో సుహాసిని ఒకరు. కన్నడ హీరోయిన్ల హవా కొనసాగుతున్న తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది. వరుసగా సీరియల్స్ చేస్తూ తన నటనతో ప్రేక్షకుల మనసుని దోచుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు స్టార్ మా లో ప్రసారమవుతున్న మామగారు అనే సీరియల్ లో నటిస్తుంది. అత్తింటికి ఎటువంటి మచ్చ రాకుండా గౌరవాన్ని పెంపొందించేలా కాపాడుకునే కోడలు పాత్రలో ఈమె నటిస్తుంది. ఈ సీరియల్ కూడా మంచి రేటింగ్ తో రావడంతో ఈమె సీరియల్స్ తో బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ సడన్ షాక్ ఇస్తూ సీరియల్స్ కి గుడ్ బై చెప్పబోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. నిజంగానే సుహాసిని సీరియల్స్ నుంచి తప్పుకుంటుందా? ఎందుకు సుహాసిని సీరియల్స్ కి దూరం అవుతుంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.. అసలు మ్యాటరేంటంటే..
బుల్లితెరపై పలు సీరియస్లలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న యాక్టర్స్ డైరెక్టర్లుగా నిర్మాతలుగా మారుతున్న విషయం తెలిసిందే. కార్తీకదీపం ఫేమ్ హీరో డాక్టర్ బాబు అలియాస్ నిరూపం పరిటాల ఈ మధ్య నిర్మాతగా మారి వరసగా సీరియల్స్ ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. అదేవిధంగా ఆయన బాటలోనే నడుస్తుంది హీరోయిన్ సుహాసిని. ఒకవైపు హీరోయిన్ గా సీరియల్స్ చేస్తూనే మరోవైపు నిర్మాతగా మరి సీరియల్స్ ని తెరకెక్కిస్తుంది. అయితే ప్రస్తుతం ఈమె కేవలం నిర్మాతగా మాత్రమే సీరియల్స్ ని నిర్మించాలని భావిస్తుందట. ప్రస్తుతం తన నిర్మాణ సంస్థపై వరుసగా సీరియల్స్ ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనివల్లే ఆమె హీరోయిన్గా ఇక మీదట సీరియల్స్ చేయదు అని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే సుహాసిని క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు…