Karnataka-Tamil Nadu: కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరి మంటలు మళ్లీ రాజుకున్నాయ్. ఆ సెగలు.. సీఎం విజయ్ జననాయగన్ థియేటర్ల దాకా పాకాయ్. రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ ఎప్పటికి తెగుతుంది? తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఈ వాటర్ వార్ ఇంకెన్నాళ్లు?
పుటుక్కున తెగేందుకు ఇది దారం కాదు. రాష్ట్రాల మధ్య రాజుకున్న జల వివాదం. కర్ణాటక-తమిళనాడు మధ్య 2 శతాబ్దాలుగా ఎడతెగని వివాదం.. ఇంకెన్నేళ్లు కొనసాగుతుందో తెలియదు. కావేరి నీళ్లు.. నిప్పులై రగులుతుంటే.. దాని సెగ తమిళనాడు సీఎం సినిమాకు తగిలింది. కావేరి పరివాహక ప్రాంతమైన మండ్యలో.. విజయ్ జననాయగన్ పోస్టర్లు చించేశారు. స్క్రీనింగ్ నిలిపేశారు. కర్ణాటక అంతటా సినిమా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు.. కావేరి వాటర్ రెగ్యులరేషన్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్సే కారణం. తమిళనాడుకు 15 రోజుల పాటు నీరు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు, తాగునీటి కొరత ఉండటంతో.. కర్ణాటక రైతులు, కన్నడ సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయ్. రాష్ట్రాల నీటి అవసరాలను తీర్చాల్సిన నదులు.. ప్రాంతాల మధ్య అగ్గిరాజేసే రణక్షేత్రాలుగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య కూడా నీళ్ల పంచాయతీ కంటిన్యూ అవుతుంది? వాటర్ వార్స్కు ఫుల్ స్టాప్ పడేదెప్పుడు? నదుల అనుసంధానమే దీనికి పరిష్కారమా?