Himalayan Glaciers: ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దులో జరిగిన విపత్తుకు ప్రధాన కారణం భారీ మంచు, రాళ్లు విరుచుకుపడ్డాయ్. అది నదిని బ్లాస్ట్ చేసింది. కానీ అసలు ప్రశ్న ఇక్కడే ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హిమాలయాల్లో గ్లేసియర్లను వేగంగా కరిగిస్తూ, మంచు పొరలను అస్థిరం చేస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. 2000 తర్వాత హిందూకుష్-హిమాలయాల్లో మంచు నష్టం వేగం పెరిగింది. ఈ టైంలో నేపాల్ విదేశాంగ మంత్రి షిషిర్ ఖనాల్ అమెరికా, చైనా, భారత్ వంటి ప్రధాన ఉద్గార దేశాలు మోరల్ లయబిలిటీతో పరిహారం ఇవ్వాలని కోరారు. అయితే ప్రతి వరదను నేరుగా గ్రీన్హౌస్ గ్యాసెస్ కే ఆపాదించగలమా? ఇలాంటి సమస్యలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు కనుక్కోవాలి. ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థ ఉండాలి. పైన చైనా ఉంది. వాళ్లు అలర్ట్ చేయకపోవడం కూడా ముప్పును పెంచింది. చైనాను గట్టిగా నిలదీయాల్సిన నేపాల్ మెత్తగా కనిపిస్తోంది.