Kadiri ZPHS: కదిరి ZPHSలో ప్రమాదం జరిగింది. మధ్యాహ్న భోజనం సమయంలో.. వేడి వేడి కర్రీ విద్యార్థులపై పడింది. ఈ ఇష్యూపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది.
స్కూల్లో మధ్యాహ్న భోజనం వడ్డించడానికి డైనింగ్ హాల్ లేదు. విశాలమైన స్థలం లేదు. విద్యార్థులంతా.. ఆ ఇరుకైన కారిడార్ల మధ్యే కూర్చొని తినాలి. పిల్లలంతా వరుసగా కూర్చున్నారు. కర్రీ తెస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కాలుజారి కిందపడ్డారు. అంతే.. అతని చేతిలోని పెద్ద గిన్నెలో నుంచి వేడి వేడి కర్రీ క్షణంలో ఎగసి విద్యార్థులపై పడింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి జడ్పీ హైస్కూల్లో జరిగింది ఈ ప్రమాదం. ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు.
ఇరుకు ప్రదేశంలో భోజనం వడ్డించడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విద్యార్థులను గుట్టుగా ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. టీచర్లు సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే విమర్శలు వస్తున్నాయ్. ఈ ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించకపోవడం హాట్ టాపిక్గా మారింది. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిమీదే ఇప్పుడు చర్చ నడుస్తోంది.
Also Read: ఫార్ములా-ఈ స్కామ్లో KTR A-1.. ఏసీబీ 77 పేజీల ఛార్జ్షీట్లో సంచలన నిజాలు!