Ananthapuram: అనంతపురం జాతీయ రహదారిపై కొందరు యువకులు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా హల్ చల్ చేశారు . ఒకే బైక్పై ముగ్గురు యువకులు ఎక్కి, చొక్కాలు విప్పి అర్థనగ్నంగా ప్రయాణిస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేశారు. అతివేగంతో బైక్ను నడపడమే కాకుండా, రహదారిపై వెళ్తున్న ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా విన్యాసాలు చేస్తూ హల్చల్ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే అదే రోడ్డు పై వెళ్తున్న వాహనదారులు వారిని మందలించే ప్రయత్నం చేశారు.. దీంతో ఆ యువకులు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. “పోలీసులు మమ్మల్ని ఏమీ చేయలేరు, మాకు ఎవరూ అడ్డు చెప్పలేరు” అంటూ అహంకారంతో మాట్లాడారు. మైనర్లు కావడంతో చట్టం తమను ఏమీ చేయదనే ధీమా వారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో సదరు బైక్ నంబర్ను గుర్తించి, ఆ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు మైనర్లుగా తేలడంతో, ఆ వాహనం ఎవరి పేరు మీద ఉందో వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి అశ్లీల ప్రవర్తన, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.
Also Read: ఆవు బీభత్సం.. వెంటాడి మరీ బాలికపై, సీసీటీవీ ఫుటేజ్
ప్రస్తుతం పోలీసులు ఆ యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి, భారీ జరిమానా విధించారు. రోడ్డు భద్రత నియమాలను అతిక్రమిస్తే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ ప్రమాదాలు జరిగితే యజమానులదే బాధ్యత అని పోలీసులు తేల్చి చెప్పారు.
చొక్కా విప్పి నడిరోడ్డుపై యువకుల త్రిబుల్ బైక్ రైడింగ్
అనంతపురం హైవేపై మైనర్ల ర్యాష్ డ్రైవింగ్
అడిగితే పోలీసులు మమ్మల్ని ఏమీ చేయలేరని సమాధానం
రైడర్స్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Minor Boys rash driving on the road with their shirts off on Anantapur highway pic.twitter.com/s95KsVG3ho
— BIG TV Breaking News (@bigtvtelugu) February 3, 2026